Kishan Reddy: పీకేని కేసీఆర్ తిట్టాడు.. పెట్టి బేడా సర్దుకుని వెళ్లిపోయాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, అన్నాడీఎంకే కూడా జాతీయ పార్టీలే.. దేశంలో పార్టీలు రావడం, పోవడం కొత్త కాదు అన్నారు. ఒక్క సీటు లేని జాతీయ పార్టీలు కూడా ఉన్నాయన్న ఆయన.. ఎవరు ఏందో వచ్చే ఎన్నికల్లో తేలుతుందన్నారు. ఇక, ప్రశాంత్ కిషోర్ (పీకే) కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవదు అని పెట్టే బేడ సర్దుకుని పోయాడట అని వ్యాఖ్యానించారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ తనని తిట్టి పంపించాడని పీకే తన స్నేహితులకు చెప్పుకున్నారని తెలిపారు కిషన్రెడ్డి.. దేశంలో పచ్చి అబద్ధాలు అడే కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని ఆరోపించిన ఆయన.. కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారు.. కేసీఆర్ ప్రధాని అయినట్టు, ఆయన కూతురు ముఖ్య శాఖ నిర్వహిస్తున్నట్టు, కేటీఆర్ సీఎం అయినట్టు, ఆ కుటుంబం పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.
Read Also: Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
ఉత్తర కుమార మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్రెడ్డి.. దేశంలో ఏ పార్టీ కూడా ఆయనతో కలిసి రావడం లేదన్నారు.. కేసీఆర్ను కలిసిన నేతలు కూడా ఆ మాటలు మేము అన లేదు అని వివరణ ఇచ్చుకుంటున్నారు.. జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉందన్నారు.. మజ్లిస్ పార్టీ కోసమే కేసీఆర్ పార్టీ పెడుతున్నారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారన్న ఆయన.. టీఆర్ఎస్కి మిగిలిన ఏకైక రాజకీయ మిత్ర పక్షం ఎంఐఎం మాత్రమే అన్నారు.. నెగెటివ్ అటిట్యూడ్ తో పెట్టిన ఏ పార్టీ బతికి బట్ట కట్టలేదన్నారు. వైఫల్యాల నుండి చర్చ మరల్చేందుకు కేసీఆర్ పార్టీ పెడుతున్నారని విమర్శించారు.. దేశంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించడం కోసం జాతీయ పార్టీ పెడుతున్నారని మండిపడ్డ ఆయన.. కేసీఆర్ కింద భూమి తెలంగాణలో కదులుతుంది.. అయన మాత్రం ఆకాశానికి ఎగురాలని అనుకుంటున్నాడని సెటైర్లు వేశారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు కలలో కూడా సీబీఐ, ఈడీ, ఐటీలే కనిపిస్తున్నాయన్నారు కిషన్రెడ్డి.. అయన కుటుంబంపై గ్రామాల్లో కథల కథలుగా చేపుకుంటునారని.. కేసీఆర్ తొండి ఆట ఆడుతున్నారన్నారు.. తెలంగాణలో నిజం, ధర్మం గెలుస్తుంది.. తెలంగాణ అమరవీరులు కేసీఆర్ కుటుంబం కోసం ఆత్మహత్యలు చేసుకోలేదు… ఫామ్హౌస్ పాలన తెలంగాణలో పోవడం ఖాయం అన్నారు.. ఇక, మునుగోడు ఎన్నికకు బీజేపీ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు కిషన్రెడ్డి.. మునుగోడులో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది..మునుగోడు ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతించిన ఆయన.. మోటార్లకు మీటర్ల ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!