Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Union Minister Kishan Reddy Sensational Comments On Prashant Kishor And Kcr

Kishan Reddy: పీకేని కేసీఆర్‌ తిట్టాడు.. పెట్టి బేడా సర్దుకుని వెళ్లిపోయాడు..!

Published Date :October 3, 2022 , 1:14 pm
By Sudhakar Ravula
Kishan Reddy: పీకేని కేసీఆర్‌ తిట్టాడు.. పెట్టి బేడా సర్దుకుని వెళ్లిపోయాడు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం కేసీఆర్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, అన్నాడీఎంకే కూడా జాతీయ పార్టీలే.. దేశంలో పార్టీలు రావడం, పోవడం కొత్త కాదు అన్నారు. ఒక్క సీటు లేని జాతీయ పార్టీలు కూడా ఉన్నాయన్న ఆయన.. ఎవరు ఏందో వచ్చే ఎన్నికల్లో తేలుతుందన్నారు. ఇక, ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) కూడా టీఆర్ఎస్‌ పార్టీ గెలవదు అని పెట్టే బేడ సర్దుకుని పోయాడట అని వ్యాఖ్యానించారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనని తిట్టి పంపించాడని పీకే తన స్నేహితులకు చెప్పుకున్నారని తెలిపారు కిషన్‌రెడ్డి.. దేశంలో పచ్చి అబద్ధాలు అడే కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని ఆరోపించిన ఆయన.. కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారు.. కేసీఆర్‌ ప్రధాని అయినట్టు, ఆయన కూతురు ముఖ్య శాఖ నిర్వహిస్తున్నట్టు, కేటీఆర్ సీఎం అయినట్టు, ఆ కుటుంబం పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.

Read Also: Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్‌ ఎప్పుడంటే..?

Also Read

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
  • Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
  • Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

ఉత్తర కుమార మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కిషన్‌రెడ్డి.. దేశంలో ఏ పార్టీ కూడా ఆయనతో కలిసి రావడం లేదన్నారు.. కేసీఆర్‌ను కలిసిన నేతలు కూడా ఆ మాటలు మేము అన లేదు అని వివరణ ఇచ్చుకుంటున్నారు.. జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారో అర్థం కాక ప్రగతి భవన్ ముందే తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉందన్నారు.. మజ్లిస్ పార్టీ కోసమే కేసీఆర్‌ పార్టీ పెడుతున్నారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారన్న ఆయన.. టీఆర్ఎస్‌కి మిగిలిన ఏకైక రాజకీయ మిత్ర పక్షం ఎంఐఎం మాత్రమే అన్నారు.. నెగెటివ్ అటిట్యూడ్‌ తో పెట్టిన ఏ పార్టీ బతికి బట్ట కట్టలేదన్నారు. వైఫల్యాల నుండి చర్చ మరల్చేందుకు కేసీఆర్‌ పార్టీ పెడుతున్నారని విమర్శించారు.. దేశంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించడం కోసం జాతీయ పార్టీ పెడుతున్నారని మండిపడ్డ ఆయన.. కేసీఆర్‌ కింద భూమి తెలంగాణలో కదులుతుంది.. అయన మాత్రం ఆకాశానికి ఎగురాలని అనుకుంటున్నాడని సెటైర్లు వేశారు.

కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు కలలో కూడా సీబీఐ, ఈడీ, ఐటీలే కనిపిస్తున్నాయన్నారు కిషన్‌రెడ్డి.. అయన కుటుంబంపై గ్రామాల్లో కథల కథలుగా చేపుకుంటునారని.. కేసీఆర్‌ తొండి ఆట ఆడుతున్నారన్నారు.. తెలంగాణలో నిజం, ధర్మం గెలుస్తుంది.. తెలంగాణ అమరవీరులు కేసీఆర్‌ కుటుంబం కోసం ఆత్మహత్యలు చేసుకోలేదు… ఫామ్‌హౌస్‌ పాలన తెలంగాణలో పోవడం ఖాయం అన్నారు.. ఇక, మునుగోడు ఎన్నికకు బీజేపీ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు కిషన్‌రెడ్డి.. మునుగోడులో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది..మునుగోడు ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతించిన ఆయన.. మోటార్లకు మీటర్ల ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kcr
  • prashant kishor
  • Prashant Kishor and KCR
  • telangana
  • Union Minister Kishan Reddy

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions