Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో పర్యటించాలి
- ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో పర్యటించాలి..
- మూసి సుందరీకరణకు వ్యతిరేకంగా కాదు.. రూ. 1 లక్ష 50 కోట్లతో చేస్తామనేదానికి వ్యతిరేకం..
- మూసి సుందరీకరణలో పేదలకు నష్టం కలిగిస్తామంటే సహించం: కేంద్రమంత్రి బండి సంజయ్
Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా వెజిటేబుల్ మార్కెట్ సౌచాలయాలకు భూమి పూజ సీసీ రోడ్లు నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే, లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. అలాగే, మూసి సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు.. 15 వేల కోట్ల అంచనాలతో పూర్తయ్యే మూసీ నది సుందరీకరణను రూ. 1,50,000 కోట్లతో చేస్తామనడానికి వ్యతిరేకం చెప్పుకొచ్చారు.
Read Also: AUS vs IND: కోహ్లీ, రోహిత్ భవితవ్యం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది: గవాస్కర్
Also Read
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ఇక, మూసి సుందరీకరణలో పేదలకు నష్టం కలిగిస్తామంటే సహించం అని బండి సంజయ్ తెలిపారు. మూసి ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ హై కమాండ్ అల్లుడికి కట్ట పెట్టాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. హైడ్రా నుంచి ప్రజల దృష్టి మరలించడానికి మూసి అభివృద్ధి నాటకం ఆడుతుంది.. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రకటనలు ఇస్తుంది.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్లో రైతులకు పంచినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ హై కమాండ్ కు కప్పం కడుతూ మహారాష్ట్రలో పేపర్ ప్రకటనలు ఇస్తుందని ఆరోపించారు. సర్పంచ్ పెండింగ్ బిల్లుల సమస్యలపై మొదట స్పందించింది బీజేపీ పార్టీ.. సర్పంచుల సమస్యలకు కారణమైన బీఆర్ఎస్ ఏ రకంగా పోరాడుతుంది అని ప్రశ్నించారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాట్లాడడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
తాజావార్తలు
-
Vinesh Phogat: బ్రిజ్ భూషణ్ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!
-
AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
-
SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!