RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Kalabhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోట్లకు పడగలెత్తిన పెండింగ్ బకాయిల కారణంగా బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గురువారం సీజ్ చేసింది. TSRTC -2016 సంవత్సరంలో కళా భవన్ను సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్కి లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుంది. చెల్లించని లీజు బిల్లుల కారణంగా, కళా భవన్ను సీజ్ చేయాలని, లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Read also: Hyderabad Crime: ఫుల్ గా తాగారు.. వాచ్ మెన్ ను పై నుంచి తోసేశారు
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పందం ప్రకారం కల్యాణ మండపంతోపాటు ఆవరణలోని మరో మూడు మినీ ఫంక్షన్ హాళ్లను లీజుకు తీసుకుని ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. అధికారుల ప్రకారం, సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ TSRTCకి నెలకు 25.16 లక్షలు చెల్లించాలి. అయితే, కొంతకాలంగా కంపెనీ అద్దె మొత్తాన్ని చెల్లించకపోవడంతో రూ.6.55 కోట్ల విలువైన బకాయిలు పడ్డాయి. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు సంస్థ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆర్టీసీ సీనియర్ అధికారులు తెలిపారు. ఇంతకుముందు, TSRTC అధికారులు కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలని గుర్తు చేస్తూ సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన రాలేదు. “ఒప్పందం ప్రకారం, నెలవారీ అద్దె చెల్లించకపోతే, టిఎస్ఆర్టిసి అధికారులు రిమైండర్లు, హెచ్చరికలుగా నోటీసులు జారీ చేయడం ద్వారా ఆర్టీసీ కళా భవన్ను స్వాధీనం చేసుకోవచ్చు” అని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలుమార్లు నోటీసులకు సుచిరిండియా కంపెనీ స్పందించకపోవడంతో, ఒప్పందాన్ని కూడా రద్దు చేయడమే కాకుండా.. కళాభవన్ను టీఎస్ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. “కాంట్రాక్ట్లోని నిబంధనల ప్రకారం ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. మేము ఆర్టీసీ కళాభవన్ను సీజ్ చేస్తున్నాము మరియు ఆవరణలో దీనికి సంబంధించి నోటీసును కూడా ఉంచామని అధికారి తెలిపారు.
Anand Mohan: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!