RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Kalabhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోట్లకు పడగలెత్తిన పెండింగ్ బకాయిల కారణంగా బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గురువారం సీజ్ చేసింది. TSRTC -2016 సంవత్సరంలో కళా భవన్ను సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్కి లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుంది. చెల్లించని లీజు బిల్లుల కారణంగా, కళా భవన్ను సీజ్ చేయాలని, లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Read also: Hyderabad Crime: ఫుల్ గా తాగారు.. వాచ్ మెన్ ను పై నుంచి తోసేశారు
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పందం ప్రకారం కల్యాణ మండపంతోపాటు ఆవరణలోని మరో మూడు మినీ ఫంక్షన్ హాళ్లను లీజుకు తీసుకుని ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. అధికారుల ప్రకారం, సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ TSRTCకి నెలకు 25.16 లక్షలు చెల్లించాలి. అయితే, కొంతకాలంగా కంపెనీ అద్దె మొత్తాన్ని చెల్లించకపోవడంతో రూ.6.55 కోట్ల విలువైన బకాయిలు పడ్డాయి. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు సంస్థ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆర్టీసీ సీనియర్ అధికారులు తెలిపారు. ఇంతకుముందు, TSRTC అధికారులు కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలని గుర్తు చేస్తూ సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన రాలేదు. “ఒప్పందం ప్రకారం, నెలవారీ అద్దె చెల్లించకపోతే, టిఎస్ఆర్టిసి అధికారులు రిమైండర్లు, హెచ్చరికలుగా నోటీసులు జారీ చేయడం ద్వారా ఆర్టీసీ కళా భవన్ను స్వాధీనం చేసుకోవచ్చు” అని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలుమార్లు నోటీసులకు సుచిరిండియా కంపెనీ స్పందించకపోవడంతో, ఒప్పందాన్ని కూడా రద్దు చేయడమే కాకుండా.. కళాభవన్ను టీఎస్ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. “కాంట్రాక్ట్లోని నిబంధనల ప్రకారం ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. మేము ఆర్టీసీ కళాభవన్ను సీజ్ చేస్తున్నాము మరియు ఆవరణలో దీనికి సంబంధించి నోటీసును కూడా ఉంచామని అధికారి తెలిపారు.
Anand Mohan: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!