RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Kalabhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోట్లకు పడగలెత్తిన పెండింగ్ బకాయిల కారణంగా బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గురువారం సీజ్ చేసింది. TSRTC -2016 సంవత్సరంలో కళా భవన్ను సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్కి లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుంది. చెల్లించని లీజు బిల్లుల కారణంగా, కళా భవన్ను సీజ్ చేయాలని, లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Read also: Hyderabad Crime: ఫుల్ గా తాగారు.. వాచ్ మెన్ ను పై నుంచి తోసేశారు
Also Read
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పందం ప్రకారం కల్యాణ మండపంతోపాటు ఆవరణలోని మరో మూడు మినీ ఫంక్షన్ హాళ్లను లీజుకు తీసుకుని ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. అధికారుల ప్రకారం, సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ TSRTCకి నెలకు 25.16 లక్షలు చెల్లించాలి. అయితే, కొంతకాలంగా కంపెనీ అద్దె మొత్తాన్ని చెల్లించకపోవడంతో రూ.6.55 కోట్ల విలువైన బకాయిలు పడ్డాయి. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు సంస్థ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆర్టీసీ సీనియర్ అధికారులు తెలిపారు. ఇంతకుముందు, TSRTC అధికారులు కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలని గుర్తు చేస్తూ సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన రాలేదు. “ఒప్పందం ప్రకారం, నెలవారీ అద్దె చెల్లించకపోతే, టిఎస్ఆర్టిసి అధికారులు రిమైండర్లు, హెచ్చరికలుగా నోటీసులు జారీ చేయడం ద్వారా ఆర్టీసీ కళా భవన్ను స్వాధీనం చేసుకోవచ్చు” అని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలుమార్లు నోటీసులకు సుచిరిండియా కంపెనీ స్పందించకపోవడంతో, ఒప్పందాన్ని కూడా రద్దు చేయడమే కాకుండా.. కళాభవన్ను టీఎస్ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. “కాంట్రాక్ట్లోని నిబంధనల ప్రకారం ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. మేము ఆర్టీసీ కళాభవన్ను సీజ్ చేస్తున్నాము మరియు ఆవరణలో దీనికి సంబంధించి నోటీసును కూడా ఉంచామని అధికారి తెలిపారు.
Anand Mohan: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!