RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Kalabhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోట్లకు పడగలెత్తిన పెండింగ్ బకాయిల కారణంగా బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గురువారం సీజ్ చేసింది. TSRTC -2016 సంవత్సరంలో కళా భవన్ను సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్కి లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుంది. చెల్లించని లీజు బిల్లుల కారణంగా, కళా భవన్ను సీజ్ చేయాలని, లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Read also: Hyderabad Crime: ఫుల్ గా తాగారు.. వాచ్ మెన్ ను పై నుంచి తోసేశారు
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పందం ప్రకారం కల్యాణ మండపంతోపాటు ఆవరణలోని మరో మూడు మినీ ఫంక్షన్ హాళ్లను లీజుకు తీసుకుని ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. అధికారుల ప్రకారం, సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ TSRTCకి నెలకు 25.16 లక్షలు చెల్లించాలి. అయితే, కొంతకాలంగా కంపెనీ అద్దె మొత్తాన్ని చెల్లించకపోవడంతో రూ.6.55 కోట్ల విలువైన బకాయిలు పడ్డాయి. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు సంస్థ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆర్టీసీ సీనియర్ అధికారులు తెలిపారు. ఇంతకుముందు, TSRTC అధికారులు కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలని గుర్తు చేస్తూ సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన రాలేదు. “ఒప్పందం ప్రకారం, నెలవారీ అద్దె చెల్లించకపోతే, టిఎస్ఆర్టిసి అధికారులు రిమైండర్లు, హెచ్చరికలుగా నోటీసులు జారీ చేయడం ద్వారా ఆర్టీసీ కళా భవన్ను స్వాధీనం చేసుకోవచ్చు” అని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలుమార్లు నోటీసులకు సుచిరిండియా కంపెనీ స్పందించకపోవడంతో, ఒప్పందాన్ని కూడా రద్దు చేయడమే కాకుండా.. కళాభవన్ను టీఎస్ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. “కాంట్రాక్ట్లోని నిబంధనల ప్రకారం ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. మేము ఆర్టీసీ కళాభవన్ను సీజ్ చేస్తున్నాము మరియు ఆవరణలో దీనికి సంబంధించి నోటీసును కూడా ఉంచామని అధికారి తెలిపారు.
Anand Mohan: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..