RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Kalabhavan: టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్ను టీఎస్ఆర్టీసీ సీజ్ చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో లీజు ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోట్లకు పడగలెత్తిన పెండింగ్ బకాయిల కారణంగా బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గురువారం సీజ్ చేసింది. TSRTC -2016 సంవత్సరంలో కళా భవన్ను సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్కి లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుంది. చెల్లించని లీజు బిల్లుల కారణంగా, కళా భవన్ను సీజ్ చేయాలని, లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Read also: Hyderabad Crime: ఫుల్ గా తాగారు.. వాచ్ మెన్ ను పై నుంచి తోసేశారు
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒప్పందం ప్రకారం కల్యాణ మండపంతోపాటు ఆవరణలోని మరో మూడు మినీ ఫంక్షన్ హాళ్లను లీజుకు తీసుకుని ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. అధికారుల ప్రకారం, సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ TSRTCకి నెలకు 25.16 లక్షలు చెల్లించాలి. అయితే, కొంతకాలంగా కంపెనీ అద్దె మొత్తాన్ని చెల్లించకపోవడంతో రూ.6.55 కోట్ల విలువైన బకాయిలు పడ్డాయి. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు సంస్థ ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఆర్టీసీ సీనియర్ అధికారులు తెలిపారు. ఇంతకుముందు, TSRTC అధికారులు కూడా పెండింగ్ బకాయిలు చెల్లించాలని గుర్తు చేస్తూ సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన రాలేదు. “ఒప్పందం ప్రకారం, నెలవారీ అద్దె చెల్లించకపోతే, టిఎస్ఆర్టిసి అధికారులు రిమైండర్లు, హెచ్చరికలుగా నోటీసులు జారీ చేయడం ద్వారా ఆర్టీసీ కళా భవన్ను స్వాధీనం చేసుకోవచ్చు” అని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పలుమార్లు నోటీసులకు సుచిరిండియా కంపెనీ స్పందించకపోవడంతో, ఒప్పందాన్ని కూడా రద్దు చేయడమే కాకుండా.. కళాభవన్ను టీఎస్ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. “కాంట్రాక్ట్లోని నిబంధనల ప్రకారం ఆర్టీసీకి ఎలాంటి అద్దె చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. మేము ఆర్టీసీ కళాభవన్ను సీజ్ చేస్తున్నాము మరియు ఆవరణలో దీనికి సంబంధించి నోటీసును కూడా ఉంచామని అధికారి తెలిపారు.
Anand Mohan: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదల.. వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్
తాజావార్తలు
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!