Shabarimala: అయ్యప్ప భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్… బస్సుల షెడ్యూల్ ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabarimala: అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 5 నుంచి ఈ సర్వీసు ప్రారంభం కానుందని.. అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా టీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిందని, వాటిని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సమయం, టికెట్ ధరను కేటాయించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంటామన్నారు.
ఇటీవల అయ్యప్ప భక్తులు ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. ఇక చార్జీలు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి శబరమల వెళ్లే ప్రతి ప్రయాణికుడికి రూ. 13,600 చొప్పున వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు తెలిపింది. జనవరి 5న అంటే శుక్రవారం నాడు లహరి బస్సు MGBS నుండి బయలుదేరుతుందని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
Read also: Jasprit Bumrah 5 Wickets: ఆదిలోనే షాకిచ్చిన బుమ్రా.. 7వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా!
ఆర్టీసీ ప్రకటన ప్రకారం శబరమల బస్సు షెడ్యూల్ ఇలా..
* బస్సు మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు MGBS నుండి బయలుదేరుతుంది.
* 2వ రోజు రాత్రి 7.30 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ సందర్శించిన అనంతరం అదే రోజు రాత్రి 10.30 గంటలకు తిరిగి వస్తారు.
* 3వ రోజు ఉదయం 6.30 గంటలకు గురువాయూర్ చేరుకుంటారు. తిరిగి 12.30 గంటలకు బయలుదేరుతుంది.
* 4వ రోజు ఉదయం 9.20 గంటలకు పంబ చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది.
* 4వ రోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమేలి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరుతుంది.
* 5వ రోజు ఉదయం 5.20 గంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. మళ్లీ రాత్రి 9.20 గంటలకు ప్రారంభమవుతుంది.
* 5వ రోజు సాయంత్రం 5.30 గంటలకు మదురై చేరుకుంటారు. తిరిగి 11.20 గంటలకు బయలుదేరుతుంది.
* 6వ రోజు ఉదయం 7.30 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు తిరిగి వస్తుంది.
* 6వ రోజు సాయంత్రం 6.10 గంటలకు కంచి చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున 2.10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతుంది.
* 7వ రోజు ఉదయం 11.10 గంటలకు మహానంది చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి నేరుగా ఎంజీబీఎస్కు చేరుకుంటామని ఆర్టీసీ తెలిపింది.
Vellampalli Srinivas: ఏ పార్టీలో చేరాలన్నది షర్మిల ఇష్టం.. నిన్నటి వరకు తెలంగాణలో ఉన్నారు.. ఏం మాట్లాడుతారో చూడాలి
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..