Kadiyam Srihari: మోడీ ఇక చాలు.. మాకు తెలంగాణ మోడల్ కావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మోడల్.. గుజరాత్ మోడల్ను తలదన్నేలా ఉంది… మోడీ ఇక చాలు.. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. మేం తెలంగాణ మోడల్ ను ప్రచారం చేసుకోలేదు.. కానీ, గుజరాత్ మోడల్ అంటూ మోడీ బాగా పబ్లిసిటీ చేసుకున్నారన్న ఆయన.. తెలంగాణ మోడల్.. గుజరాత్ను తలదన్నేసిందన్నారు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు కడియం.. దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని ఫైర్ అయిన కడియం.. తిరోగమన దిశగా భారత దేశం వెళ్లోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Telangana Assembly Sessions 2022: ఈటెల సస్పెన్షన్ వేటు.. ఎప్పటివరకు అంటే..
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర సర్కార్ అన్ని పరిశ్రమలను ప్రైవేటుకు అమ్ముకోవాలని చూస్తోంది.. 16 కోట్ల ఉద్యోగాలు కేంద్రంలో రావాల్సి ఉండగా 16 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు కడియం శ్రీహరి.. రిజర్వేషన్లు పోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తోంది. దీన్ని అందరం కలిసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.. ఉచితాలు వద్దని మోడీ అంటున్నారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన సమానత్వం వచ్చిందా? అని ప్రశ్నించారు. పేద వర్గాలపై, మైనార్టీలపై, బడుగు బలహీన వర్గాలపై మోడీకి, బీజేపీకి కోపం ఉందన్న ఆయన.. సమాజం నుంచి వెలివేయాలని, దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అంటే వారికి పడదన్నారు. మేం భారతీయులం కాదా..? మేం లేకుండానే భారత దేశం ఏర్పడిందా? అంటూ నిలదీశారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోంది. దాన్ని నిలువరించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు.. 12 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర పెద్దలు మాఫీ చేశారు.. నీ అయ్యా జాగీరా, నీ తాత సొమ్మా, సిగ్గుండాలి అంటూ విరుచుకుపడ్డారు. 8 ఏళ్లలో మోడీ ఎన్నో వేషాలు వేశారు.. అవన్నీ ప్రజలను మోసం చేయడానికే అని విమర్శించారు కడియం శ్రీహరి.
తాజావార్తలు
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!