Jagga Reddy:జగ్గారెడ్డి కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరుద్యోగం సమస్యని హైలైట్ చేయడం, నిరసన తెలపడం జగ్గారెడ్డికి నచ్చలేదు. తన బర్త్ డేకి కేసీఆర్ విషెస్ చెప్పారని, బర్త్ డే నాడు నిరుద్యోగం పై నిరసన తెలపడం ఏంటన్నారు జగ్గారెడ్డి. మరోవైపు పార్టీకి, పార్టీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో శుక్రవారం ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారి నుంచి కీలక సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాజకీయ భవిష్యత్పై శనివారం ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం వుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రూపంలో తెలియజేయాలని జగ్గారెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని జగ్గారెడ్డి కొన్ని రోజులుగా చెబుతున్నారు.. తాను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారని ఆయన కలత చెందుతున్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2018 ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచింది జగ్గారెడ్డి ఒక్కరే. 2004లో టీఆర్ఎస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2009, 2018 ఎన్నికల్లో గెలిచారు.. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు.. ఏదిఏమైనా జగ్గారెడ్డి కాంగ్రెస్ను వీడితే అది ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారానికి ఇటీవల జరిగిన పరిణామాలు కారణంగా చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంగారెడ్డికి వచ్చినప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగారు.. కేటీఆర్ జగ్గారెడ్డికి మధ్య సంభాషణలు సాగాయి. దీంతో అందరిలోనూ ఆసక్తి కలిగింది. ప్రస్తుతం జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా వుంటారా? రాజీనామా చేసి వేరే పార్టీలో చేరతారనేది హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
-
YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!