Jagga Reddy:జగ్గారెడ్డి కోవర్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరుద్యోగం సమస్యని హైలైట్ చేయడం, నిరసన తెలపడం జగ్గారెడ్డికి నచ్చలేదు. తన బర్త్ డేకి కేసీఆర్ విషెస్ చెప్పారని, బర్త్ డే నాడు నిరుద్యోగం పై నిరసన తెలపడం ఏంటన్నారు జగ్గారెడ్డి. మరోవైపు పార్టీకి, పార్టీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో శుక్రవారం ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారి నుంచి కీలక సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాజకీయ భవిష్యత్పై శనివారం ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం వుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రూపంలో తెలియజేయాలని జగ్గారెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని జగ్గారెడ్డి కొన్ని రోజులుగా చెబుతున్నారు.. తాను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారని ఆయన కలత చెందుతున్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2018 ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచింది జగ్గారెడ్డి ఒక్కరే. 2004లో టీఆర్ఎస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 2009, 2018 ఎన్నికల్లో గెలిచారు.. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు.. ఏదిఏమైనా జగ్గారెడ్డి కాంగ్రెస్ను వీడితే అది ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారానికి ఇటీవల జరిగిన పరిణామాలు కారణంగా చెబుతున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంగారెడ్డికి వచ్చినప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగారు.. కేటీఆర్ జగ్గారెడ్డికి మధ్య సంభాషణలు సాగాయి. దీంతో అందరిలోనూ ఆసక్తి కలిగింది. ప్రస్తుతం జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా వుంటారా? రాజీనామా చేసి వేరే పార్టీలో చేరతారనేది హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!