Revanth reddy: తీగలాగితే డొంక కదిలిందా?! మీకర్థమవుతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth reddy: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీక్…తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా…?! అంటూ రాసుకొచ్చారు. విచారణలో ‘బావ’…@CMOTelanganaలో బావమరిది…? మీకర్థమవుతోందా… “పరువు”గల @KTRBRS గారూ…! అని ట్వీట్లో పేర్కొన్నారు. ఈమాటలకు టీఎస్ పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటా జత చేశారు. ప్రస్తుతం రేవంత్ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయన చెప్పిన బావబామ్మర్ధులు ఎవరన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది.
TSPSC పేపర్ లీక్…
తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా…?!Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
విచారణలో ‘బావ’…@CMOTelangana లో బావమరిది…?
మీకర్థమవుతోందా…
“పరువు”గల @KTRBRS గారూ…! pic.twitter.com/V4ewvGqRjF— Revanth Reddy (@revanth_anumula) April 1, 2023
మరోవైపు పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే కమిషన్ సభ్యులకు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యుడు లింగారెడ్డిలను సిట్ సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టయిన రమేష్, లింగారెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్నాడని, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటే.. ఇక మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లక్షల రూపాయలు చేతులు మారాయని, హవాలా కోణం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. మనుషుల ముసుగులో మృగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిక్రూట్ మెంట్ ప్రక్రియ జాగ్రత్తగా జరగాలని రేవంత్ దుయ్యబట్టారు. ప్రశ్నపత్రాలు వందల కోట్లకు అమ్ముడుపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులపై అక్రమ అరెస్టులు, కేసులు పెడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. అయతే రేవంత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ బావబామ్మర్దులు ఎవరు? అంటూ ఉత్కంఠంగా మారుతుంది.
Ambati Rambabu: నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటా..
- Tags
- BRS
- congress
- kcr
- ktr
- political news
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!