Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు లీజుకిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు. 158 కి.మీ ఓఆర్ ఆర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏర్పాట్లు చేశామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఓఆర్ఆర్ సౌకర్యాలు లేవని స్పష్టం చేశారు. పెట్టుబడులు, రవాణా సౌకర్యార్థం హైదరాబాద్లో ఓఆర్ఆర్ వేశామన్నారు. విదేశీ పెట్టుబడులకు ORR కీలకంగా మారింది. ఈగిల్ ఇన్ ఫ్రా సంస్థకు టోల్ వసూల్ కు ఇచ్చారని చెప్పారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ లు దోచుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఓఆర్ఆర్ను కేవలం టోల్ వసూలు మాత్రమే కాకుండా దాని నిర్వహణను కూడా ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని చూశారని పేర్కొన్నారు.
Read also: Errabelli Dayakar Rao: కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయండి
Also Read
టీవీఓ పద్ధతిలో ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు వెల్లడైందని తెలిపారు. కేసీఆర్ 30 ఏళ్లుగా ఓఆర్ఆర్ను అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది రూ.700-800 కోట్లు వస్తోందన్నారు. 30 ఏళ్లకు రూ.30 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నా రూ.7,380 కోట్లకు అమ్మేశారు. ఆరు నెలల క్రితమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే రానున్న ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తుందని చెప్పారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీని వెనుక రూ.1000 కోట్లు చేతులు మారాయని, పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. దీనిని కాంగ్రెస్ సహించబోదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం
- Tags
- bjp
- BRS
- congress
- kcr
- political news
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!