Errabelli Dayakar Rao: కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లా కలెక్టరేట్లో అకాల వర్షాలు, పంట నష్టం, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కలెక్టర్, అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలసత్వం వహించవద్దని అన్నారు. ఇటీవల కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నష్టపోయిన రైతుల వివరాలను వెంటనే సేకరించాలని సూచించారు. నష్టపోయిన పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు.
Read also: Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
చివరి గింజ వరకు రైతుల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, మొక్కజొన్నలను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయాలని, మొక్కజొన్న కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతేకాని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎగుమతి చేయాలన్నారు. అందుకోసం రైతులకు నష్టం వాటిల్లకుండా ట్రాన్స్ ఫోర్ట్ కొనుగోలు కేంద్రాల్లో పక్కాగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ జెడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సంబంధిత శాఖల అధికారులు, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!