Tummala Nageshwar Rao: 18న దేశ రాజకీయాల్లో మార్పుకి ఖమ్మం వేదిక కానుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageshwar Rao: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్.. జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఖమ్మం బహిరంగ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నేతలను పెద్దఎత్తున ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఖమ్మం స్థానిక నేతల వరకు ఈ పనిలో బిజీగా ఉన్నారు.
Read also: Talasani Srinivas Yadav: మన కల్చర్ మరిచిపోతున్నారు
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
ఆదివారం సభ నిర్వహణకు సంబంధించి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా క్యాంపు కార్యాలయంలో గులాబీ నేతలు సమావేశమయ్యారు. కాగా.. ఎంపీ నామా, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రయోజనాలు కోసం వేరే వ్యక్తులతో మీరువెళితే అది మీకర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 18 వ తేదీన దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి లేని విధంగా మన రాష్ట్రంలో ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలిగుదేశం జాతీయ పార్టీగా ఏర్పడింది అలానే ఇప్పుడని అన్నారు. దేశ రాజకీయాలను మలువు తిప్పే విధంగా పార్టీ అధ్యక్షుడు అడుగు వేస్తున్నాడని, 70 సంవత్సరాల స్వతంత్రలో ఎందుకు వెనుకపడ్డాం.. దేశం ముందుకు తుందని అన్నారు.
Read also: Beauty Mistakes: అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి
ఢిల్లీలో జరగాల్సిన సభను ఖమ్మం జిల్లాలో పెడుతున్నారంటే మన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరే తెలుసుకోవాలని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయైతే మీకు కావాల్సి నీరు వస్తుంది. 10 లక్షలు ఎకరాలుకు నీరు అందిస్తున్నామన్నారు. మన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ లనే దేశంలో ఆయిల్ పామ్ రేటు పెరిగిందనా అన్నారు. అశ్వారావుపేట అంటే ఆయిల్ పామ్ పంట సాగు కోసం కేరాఫ్ అడ్రస్ అన్నారు. 80 వేల కోట్లు ద్రవ్యం విదేశాలకు వెళ్తుందన్నారు. పామ్ ఆయిల్ సాగు విషయంలో ఎవరు మనేది చెందాడని తెలిపారు. మీసం మీద చెయ్యి వేసుకుని, కాలుమీద కాలు వేసుకునే విధంగా కేసీఆర్ మన రాష్ట్రంలో ప్రజలను నిలబెట్టారని తెలిపారు. అలానే దేశ ప్రజలు కూడా.. అలానే ఉండాలని kcr ఆకాంక్షించారన్నారు. 18 వ తేదీ ఒక్క రోజు కష్టపడండని పిలుపు నిచ్చారు.
Mukarram Jah: ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా ఇకలేరు..
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!