Talasani Srinivas Yadav: మన కల్చర్ మరిచిపోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav: మన కల్చర్ మరిచిపోతున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోనీ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 2014 వరకు నీళ్లు లేవు.. పంటలు లేవన్నారు. కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పాశ్చాత్య మోజులో పండగ సంస్కృతి మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పతంగులు ఎగిరిద్దామంటే కనీసం గాలి కూడా రావడం లేదన్నారు. చైనా మంజాలు అంటున్నారు.. చిన్నప్పుడు మేమే మంజాలు తయారు చేసుకునే వాళ్ళమన్నారు. ఆంధ్ర పోతే కోడి పందేలు, గుండాటలు ఆడుతారన్నారు. మన కల్చర్ మరిచిపోతున్నారని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయాలని కోరారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలి. దేశానికి అన్నం పెట్టే రైతులు, రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సంతోషంగా జీవించాలి. మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగల గొప్పతనాన్ని చాటిచెప్పాలనే ఉద్దేశంతో గాలిపటాల పండుగ నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.
Read also: Mukarram Jah: ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా ఇకలేరు..
Also Read
ఇక సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు పేర్లతో వరినాట్లు, ముగ్గులు దర్శనమిస్తున్నాయి. వెంకటాపూర్ లో తమ పొలంలో ప్రముఖుల పేర్లతో చిన్నారులు వరి నాట్లు వేశారు. ముఖ్యమంత్రి KCR, మంత్రి హరీష్ రావుపై అభిమానంతో పొలంలో వరి నాట్లు, ఇంటి దగ్గర ముగ్గులు వేసిన చిన్నారులు వేసినట్లు తెలిపారు.
Read also: Beauty Mistakes: అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి
తక్కువ సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. భారతదేశంలో ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చే రాష్ట్రం ఏది లేదన్నారు. దేశంలో ఇంటి ఇంటికి మంచి నీరు ఇచ్చే రాష్ట్రం తెలంగాణా రాష్ట్రమేనని కేంద్రం స్పష్టం చేసిందని అన్నారు. కేంద్రం విభజన చట్టంలో ఒప్పుకున్న ఒక్క అభివృద్ధి కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు. మూడు సార్లు మన ముఖ్యమంత్రి ఉంటాడు. మనేదే ప్రభుత్వం ఉంటుందని తలిపారు. పక్కనున్న కర్ణాటకలో కూడా ఓ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో మాకు అలానే కావాలి అని అడిగారంటే మన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోండని నామా నాగేశ్వర రావు అన్నారు.
Narendra Modi: మారుతున్న దేశ భవిష్యత్తుకు వందేభారత్ ఒక ఉదాహరణ
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!