Thummala Nageswara Rao: ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tummala Nageswara Rao sensational comments on the elections: తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో ఒక్కసారిగా రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీకి ఉపఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరడం దాదాపుగా ఖాయం అయింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వరంగల్ టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా పార్టీని వీడే అవకాశం ఉంది. ఆయన కూడా బీజేపీలో చేరుతున్నారనే సమచారం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు టీఆర్ఎస్ ను వీడటం మింగుడుపటడం లేదు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు బస్వరాజు సారయ్య రంగంలోకి దిగారు. ఇలాంటి రాజకీయ పరిణామాల మధ్య తుమ్మల నాగేశ్వర రావు బాంబు పేల్చారు. సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త చర్చకు తావిచ్చారు.
Also Read
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
- Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చని.. కార్యకర్తలు, నేతలు అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు ఎప్పుడు రావచ్చని కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు వ్యూహాత్మకంగా, ప్రణాళిక పరంగా సిద్ధంగా ఉండాలని సూచించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి
రానున్న ఎన్నికల్లో ఖమ్మం ప్రాంతంలో తన సత్తా చాటాలని తుమ్మల భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు కందాల ఉపేందర్ రెడ్డి వైపు కొంత మంది తుమ్మల వైపు కొందరు కార్యకర్తలు ఉన్నారు. దీంతో తన వైపు కార్యకర్తలను తిప్పుకునే ప్రయత్నంలో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా.. అందరికి అందుబాటులో ఉన్నాననే సంకేతాలు ఇచ్చేలా తుమ్మల నాగేశ్వర రావు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!