Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి
Raghunandan Rao comments on Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కాకరేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో మరోసారి ఉపఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కలరవపెట్టింది. దీంతో పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డిపై ఎదురుదాడి ప్రారంభించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యాపారం కోసమే బీజేపీలో చేరుతున్నారంటూ.. తల్లి లాంటి సోనియా గాంధీకి ద్రోహం చేశారంటూ విమర్శించారు.
ఇదిలా ఉంటే తాజాగా బుధవారం బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు, వలువలకు తేడా తెలియన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్ని దుయ్యబట్టారు. టీడీపీలో గెలిచి.. పార్టీ మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్ని విమర్శించారుు. కానీ రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. టీడీపీలోొ ఎమ్మెల్యేగా గెలిచి 14 నెలల కాంగ్రెస్ లో ఉన్నారంటూ దుయ్యబట్టారు. రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ లేకుండా పోతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారారని..? ఏ వ్యాపారం కోసం పార్టీ మారారని.. ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ లేదని.. గల్లీలో రాదని.. అని ఎద్దేవా చేశారు. రేవంత్ ఎవరికి ఏజెంటో అందరికీ తెలుసని అన్నారు. సోనియాను బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా..? అని ప్రశ్నించరాు. రేవంత్ వల్లే అందరూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని.. ఆయన విమర్శించారు.
Also Read
- Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..
- CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
- TGSRTC Strike: నేడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయా? సమ్మెపై క్లారిటీ ఇచ్చిన జేఏసీ!
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
Read Also: DK Aruna: రేవంత్ కు వార్నింగ్.. నోరు జర భద్రంగా పెట్టుకో..
నాణేనికి బొమ్మ బోరుసులా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్రేంటని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పునర్జీవనం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్దిని మునుగోడు ప్రజలు మళ్లీ గెలిపిస్తారని అన్నారు. మీ భాషలో సమాధానం చెప్పేందుకు మేం సిద్ధమని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని..మునుగోడు ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
-
Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్పై థియేటర్ మేనేజ్మెంట్ దాడి?
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!