Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao comments on Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కాకరేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో మరోసారి ఉపఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కలరవపెట్టింది. దీంతో పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డిపై ఎదురుదాడి ప్రారంభించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యాపారం కోసమే బీజేపీలో చేరుతున్నారంటూ.. తల్లి లాంటి సోనియా గాంధీకి ద్రోహం చేశారంటూ విమర్శించారు.
ఇదిలా ఉంటే తాజాగా బుధవారం బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు, వలువలకు తేడా తెలియన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్ని దుయ్యబట్టారు. టీడీపీలో గెలిచి.. పార్టీ మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్ని విమర్శించారుు. కానీ రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. టీడీపీలోొ ఎమ్మెల్యేగా గెలిచి 14 నెలల కాంగ్రెస్ లో ఉన్నారంటూ దుయ్యబట్టారు. రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ లేకుండా పోతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారారని..? ఏ వ్యాపారం కోసం పార్టీ మారారని.. ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ లేదని.. గల్లీలో రాదని.. అని ఎద్దేవా చేశారు. రేవంత్ ఎవరికి ఏజెంటో అందరికీ తెలుసని అన్నారు. సోనియాను బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా..? అని ప్రశ్నించరాు. రేవంత్ వల్లే అందరూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని.. ఆయన విమర్శించారు.
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
Read Also: DK Aruna: రేవంత్ కు వార్నింగ్.. నోరు జర భద్రంగా పెట్టుకో..
నాణేనికి బొమ్మ బోరుసులా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్రేంటని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పునర్జీవనం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్దిని మునుగోడు ప్రజలు మళ్లీ గెలిపిస్తారని అన్నారు. మీ భాషలో సమాధానం చెప్పేందుకు మేం సిద్ధమని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని..మునుగోడు ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?