MP Nama Nageshwar Rao: ఎంపీ కుమారుడికే తప్పని తిప్పలు.. బెదిరించి నగదుతో మాయమైన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ కుమారుడినే దుండగులు బెదిరించి నగదుతో మాయమైన ఘటన సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసు మరవక ముందే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి నగదుతో మాయమైన ఘటనతో భాగ్యనగర పోలీసులకు సవాల్గా మారింది. ఎంపీ కొడుకుడు వద్దే నగదు మాయం చేసి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు.
read also: Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్ చేస్తే రూ.25లక్షలు మాయం
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
వివరాల్లోకి వెళితే.. ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి కొందరు దుండగులు రూ.75 వేలు లాక్కొని పరారైన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. నగరంలోని టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా, దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. కారులో బలవంతంగా చేరిన దుండగులు కాసేపు కారులో కూర్చొని ఊరంతా తిరిగారు. కారులోంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. నగరంలో కాసేపు అటూఇటూ కారును తిప్పారు. నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపారు. పృథ్వీని కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కొన్నారు. కారును పంజాగుట్ట వద్ద తీసుకుని వచ్చి దుండగులు దిగి పరారయ్యారు. ఈ విషయాన్ని పంజాగుట్ట పీఎస్లో ఎంపీ కుమారుడు పృథ్వీ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
అయితే ఎంపీ కొడుకునే కారులో ఎక్కి అతని వద్ద నుంచి బెదిరించి డబ్బులు కాజేసిన దుండగులకు సామాన్య ప్రజలు ఓ లెక్కనా అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నగరాన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దోపీడీలకు ఆష్కారం లేకుండా సీసీ ఫోటేజీ ఏర్పాటు చేసామని చెబుతున్న పోలీసులు మరి ఎంపీ కొడుకునే బెదిరించి డబ్బులు కాజేసీన దుండుగుల కేసు సవాల్ గా మారిందని స్థానికులు చెబుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి మరి.
కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దొంగను పట్టుకున్నారు. బెంగళూరు సదాశివనగర్లోని మంత్రి నివాసంలో గతంలో సుమారు రూ.కోటి విలువైన నగదు, వస్తువులు చోరీ అయ్యాయి. ఇందులో రూ.85 లక్షల విలువైన విదేశీ నగదు, ఆరు ఖరీదైన వాచీలు పోయాయని.. మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తాజాగా దొంగను పట్టుకున్నారు.
20 Years Of Avunu Valliddaru Ista Paddaru: 20 ఏళ్ళ కిందట ‘ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’..!!
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!