MP Nama Nageshwar Rao: ఎంపీ కుమారుడికే తప్పని తిప్పలు.. బెదిరించి నగదుతో మాయమైన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ కుమారుడినే దుండగులు బెదిరించి నగదుతో మాయమైన ఘటన సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసు మరవక ముందే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి నగదుతో మాయమైన ఘటనతో భాగ్యనగర పోలీసులకు సవాల్గా మారింది. ఎంపీ కొడుకుడు వద్దే నగదు మాయం చేసి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు.
read also: Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్ చేస్తే రూ.25లక్షలు మాయం
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
- Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
వివరాల్లోకి వెళితే.. ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి కొందరు దుండగులు రూ.75 వేలు లాక్కొని పరారైన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. నగరంలోని టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా, దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. కారులో బలవంతంగా చేరిన దుండగులు కాసేపు కారులో కూర్చొని ఊరంతా తిరిగారు. కారులోంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. నగరంలో కాసేపు అటూఇటూ కారును తిప్పారు. నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపారు. పృథ్వీని కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కొన్నారు. కారును పంజాగుట్ట వద్ద తీసుకుని వచ్చి దుండగులు దిగి పరారయ్యారు. ఈ విషయాన్ని పంజాగుట్ట పీఎస్లో ఎంపీ కుమారుడు పృథ్వీ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
అయితే ఎంపీ కొడుకునే కారులో ఎక్కి అతని వద్ద నుంచి బెదిరించి డబ్బులు కాజేసిన దుండగులకు సామాన్య ప్రజలు ఓ లెక్కనా అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నగరాన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దోపీడీలకు ఆష్కారం లేకుండా సీసీ ఫోటేజీ ఏర్పాటు చేసామని చెబుతున్న పోలీసులు మరి ఎంపీ కొడుకునే బెదిరించి డబ్బులు కాజేసీన దుండుగుల కేసు సవాల్ గా మారిందని స్థానికులు చెబుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి మరి.
కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దొంగను పట్టుకున్నారు. బెంగళూరు సదాశివనగర్లోని మంత్రి నివాసంలో గతంలో సుమారు రూ.కోటి విలువైన నగదు, వస్తువులు చోరీ అయ్యాయి. ఇందులో రూ.85 లక్షల విలువైన విదేశీ నగదు, ఆరు ఖరీదైన వాచీలు పోయాయని.. మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తాజాగా దొంగను పట్టుకున్నారు.
20 Years Of Avunu Valliddaru Ista Paddaru: 20 ఏళ్ళ కిందట ‘ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’..!!
తాజావార్తలు
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
-
Harish Rao : రేవంత్ రెడ్డి పెట్టేది ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ
-
Warren Buffett: ఇకపై గేట్స్ ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వను.. సంచలన ప్రకటన చేసిన వారెన్ బఫెట్! కారణం ఇదేనా?
-
Software Employe: ‘నాకు ఈ లైఫ్ నచ్చడం లేదు’.. రూ.45 లక్షల ప్యాకేజీ అందుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన..
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!