Revanth Reddy: ఖమ్మంలో పదికి 10 సీట్లు కాంగ్రెస్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో 10 కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి.. కానీ, ఆదివాసులకు ఇస్తామన్న పోడు భూములకు పట్టాలు రాలేదన్నారు. ఆదివాసులవి గొంతెమ్మ కోరికలు కావన్న ఆయన.. అసలు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.. కేసీఆర్ ఆదివాసుల హక్కులను కాపాడతామని చెప్పారు. కానీ, కేసులు పెట్టి జైళ్లకు పంపారని మండిపడ్డారు.. చంటి పిల్లలను కూడా జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం.. దున్నేవారికి పట్టాలు ఇస్తా అని మోసం చేశారన్నారు..
ఆదివాసులు భూమిని నమ్ముకుంటున్నారు.. అమ్ముకోవడం లేదు.. కానీ, అధికారులతో పాశవిక దాడులు చేయిస్తోంది ప్రభుత్వం అని మండిపడ్డారు రేవంత్రెడ్డి.. ఆదివాసులంటే ప్రభుత్వానికి చిన్నచూపు అని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ పదే పదే హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని.. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వమే భూములు లాక్కుని అమ్ముతుందన్నారు.. ప్రజల సొమ్మును ప్రభుత్వం కొల్ల గొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 2018లో కొందరు పార్టీని మోం చేశారు.. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్న ఆయన.. ఆదివాసుల హక్కుల కోసం కాంగ్రెస్ కొట్లాడుతుంది.. కేసీఆర్ అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తాం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక్క కలం పోటుతో కేసులు కొట్టేస్తామని.. ఆదివాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కేసులకు భయపడకండి అని సూచించారు..
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
ఇక, దొరల ప్రభుత్వం పోవాలి.. పేదల ప్రభుత్వం రావాలన్న రేవంత్రెడ్డి.. పేదల ప్రభుత్వమే సోనియమ్మ రాజ్యం అన్నారు.. త్వరలోనే అశ్వారావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఇప్పటికే ఈ విషయంలో రేణుకా చౌదరి, భట్టి విక్రమార్కతో మాట్లాడానని తెలిపారు.. వారు ఢిల్లీలో ఉన్నారు.. వచ్చిన తర్వాత మాట్లాడి సభ తేదీ ప్రకటిస్తామని తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.
తాజావార్తలు
-
Shreyas Iyer: 146 మ్యాచ్ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
-
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?