వైశ్య, రెడ్డి కులాల కార్పొరేషన్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, చర్చించి.. వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో జరిగిన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కులంలో డబ్బున్నవారు, డబ్బులేనివారు ఉన్నారన్నారు.. పేదవారు ఏ కులంలో ఉన్నవారైనా, వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేసిన ఆయన.. కులం, మతం గురించి నాకు తెలియదు.. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతంగా అభివర్ణించారు. ఇక, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వైశ్య, రెడ్డి కులాల కొర్పారేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.
Read Also: Ministers: తెలంగాణ నవజాత శిశువు.. గొంతు నులిమేందుకు కేంద్రం కుట్ర..!
ఇక, తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి కేటీఆర్.. రైతు ఏ కారణంతో చనిపోయినా, ఆ కుటుంబానికి ధీమా నిచ్చేవిధంగా రూ. 5 లక్షల బీమా వస్తుందని వెల్లడించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి, ముస్సోరిలో ఐఏఎస్ లకు పాఠ్యాంశంగా చేర్చారని గుర్తుచేశారు.. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తంగళ్ళపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామన్నారు కేటీఆర్.