Telangana Excise: ఖజానాకు లిక్కర్ కిక్కు..తగ్గేదెలే అంటున్న మందుబాబులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వాల ఖజానాకు మద్యానికి మించిన కిక్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల ఖజానాలకు ఆరు బీర్లు-మూడు విస్కీ బాటిళ్ళలాగా వర్థిల్లుతున్నాయి. తెలంగాణలో మద్యం కిక్ తో ఖజానా గలగలమంటోంది. రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గురువారం ఒక్క రోజే రూ.303 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం 2,620 వైన్స్తో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లున్నాయి. మద్యం అమ్మకాల్లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లోనే వాటా ఎక్కువ ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే రూ.10 వేల కోట్లకు పైగా అమ్మకాలు
ఈ ఆర్థిక సంవత్సరం లో డిపోల నుండి 2021-22లో మద్యం అమ్మకాలు రూ.30 వేల 780 కోట్లు జరిగాయి. మార్చి నెలలో రూ.2 వేల 810 కోట్లు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాదితో పోలిస్తే గత ఏడాది అమ్మకాలు మూడువేల వరకూ తక్కువగా నమోదయ్యాయి. 2020-21లో మద్యం అమ్మకాలు 27,289 కోట్లుగా నమోదయ్యాయి. ఏ విధంగా చూసినా నెలకు రూ.2500 కోట్ల నుంచి 3 వేల కోట్ల వరకూ అమ్మకాలు సాగుతున్నాయి. అంటే రోజుకి సరాపరి 100 కోట్ల వరకూ మద్యం తాగేస్తున్నారు.
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
పండగలు, పబ్బాలు వచ్చాయంటే మద్యం తాగేవారి సంఖ్య పెరుగుతోంది. అందులోనూ సమ్మర్ ప్రారంభం కావడంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.6,700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయిన ఆర్థిక సంవత్సరంలో 4 వేల కోట్లు అదనంగా రాబట్టేందుకు సర్కారు లక్ష్యం నిర్దేశించింది. టాక్స్ పేయర్స్ పైనే ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. దీనికి తోడు డ్రంక్ అండ డ్రైవ్ అంటూ తనిఖీలు చేపట్టి పోలీసులు అదనంగా లాగేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మందుబాబులే ప్రభుత్వాలకు మహారాజపోషకులు అవుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..