Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22 మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపారు. అందులో భాగంగా కేసీఆర్కు కూడా ఆమె లేఖ పంపారు.. అంతేకాదు.. ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు కూడా.. అయితే, ఈ సమావేశానిక దూరంగా ఉండాలని గులాబీ పార్టీ బాస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Read Also: Viral: పక్షులకు ఆహారం పెడుతోన్న వృద్ధుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Also Read
- CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనా అనే చర్చ కూడా సాగుతోంది.. ఇటీవల కొన్ని రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారంటూ ప్రకటన చేశారు.. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా దీదీ పావులు కదుపుతున్నారు.. అందులో భాగంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.. రేపు ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీతో పాటు 20 పైగా రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు.. కానీ, ఈ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.. కాంగ్రెస్ పార్టీలో కలసి వేదిక పంచుకోవడానికి అనాసక్తితో ఉన్న గులాబీ పార్టీ బాస్.. ఆ సమావేశానికి వెళ్లకూడదనే భావనలో ఉన్నారని సమాచారం.. అయితే, టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రతినిధులను మాత్రం ఈ సమావేశానికి పంపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!