తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు పెరిగిన కేసులు.. ఇప్పడు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 91,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1280 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. మరో 15 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 2261 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,03,369 కి చేరింది.. రికవరీ కేసులు 5,78,748 కి పెరిగాయి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 3484 కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 21,137 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.