Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. డీఏపై చర్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో అజెండాలో ఉన్నాయని తెలిపాయి. స్వయం సహాయక సంఘాలమహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం అమలు వంటి అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించడంపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించనున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామన్న హామీ ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే ఎలాంటి నిర్ణయాలు ఉండకపోవచ్చని తెలిసింది.
Read also: Astrology: మార్చి 12, మంగళవారం దినఫలాలు
Also Read
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్కు ప్రతిపాదించే అవకాశం ..!
దాసోజు శ్రవణ్ మరియు కుర్ర సత్యనారాయణలను గత బిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఇటీవల ఈ ఉత్తర్వులను కొట్టివేసిన రాష్ట్ర హైకోర్టు.. వారి పేర్లను మరోసారి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, కోటండరామ్, అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మళ్లీ కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్కు ప్రతిపాదించే అవకాశం ఉంది. 1100 మంది రిటైర్డ్ అధికారులు ప్రభుత్వంలో కొనసాగాలా? ఈ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది కదా. అలాగే విద్యుత్ సంస్థల్లో కొత్త డైరెక్టర్లు, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, అదనపు పోస్టులతో గ్రూప్-2, గ్రూప్-3కి అనుబంధ నోటిఫికేషన్ల జారీని మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది.
Read also: BJP : 8రాష్ట్రాల్లో 100సీట్లపై బీజేపీ అభ్యర్థుల పేర్లపై చర్చ.. రెండో జాబితా ఖరారు!
కాళేశ్వరంపై విచారణ..!
కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, కొత్త సచివాలయం, అమరవీరుల స్థూపం నిర్మాణం, మిషన్ భగీరథపై జ్యుడీషియల్, విజిలెన్స్ విచారణ జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా విచారణలకు సంబంధించిన విధివిధానాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలను విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 15 అంశాలపై విచారణ జరపాలని నీటిపారుదల శాఖ విధివిధానాలను సిద్ధం చేసింది.
Gold Price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే?
తాజావార్తలు
-
Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
-
New Labor Laws India: వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు! కానీ కండిషన్స్ అప్లై..
-
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
-
Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?