CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- ఖమ్మం సీసీఎస్లో సీఐగా పని చేస్తున్నాడు..
- ఓ మహిళపట్ల కీచకుడిగా మారాడు..
- ఫోన్ నంబర్ తీసుకుని.. సాయం చేసినట్లు డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ కేసులో న్యాయం చేయాలని కోరిన మహిళను చేరదీశాడు.. ఆమెను బెదిరించి సహజీవనం చేశాడు.. రెండుసార్లు అబార్షన్ చేయించాడు.. పెళ్లి చేసుకోవాలని అడిగితే.. కాదు పొమ్మన్నాడు.. ఇదీ ఖమ్మం జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం. ఫిర్యాదు చేద్దామని వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించి.. ఆ కీచక సీఐ కేసు కాకుండా చూస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజు నాయక్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్లో సీఐగా పని చేస్తున్నాడు. వృత్తిరీత్యా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఈయన.. ఓ మహిళపట్ల కీచకుడిగా మారాడు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాల దృష్ట్యా.. సాయం చేయాలని వేడుకున్న ఆ మహిళను ట్రాప్ చేశాడు. ఫోన్ నంబర్ తీసుకుని.. సాయం చేసినట్లు నటిస్తూనే ఆమెను తన ఉచ్చులోకి లాగాడు. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించి.. వెంటాడిన సీఐ రాజునాయక్..ఎట్టకేలకు ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చింది. రెండుసార్లు కూడా ఆమెకు అబార్షన్ చేయించాడు.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
అంతేకాదు.. ఆ మహిళ కాపురాన్ని సెట్ చేస్తానని చెప్పిన సీఐ రాజు నాయక్ నిర్వాకాలు మామూలుగా లేవు. ఆమెకు ఆమె భర్తతో విడాకులు ఇప్పించాడు. అందుకోసం లాయర్ను కూడా తానే మాట్లాడాడు. మధ్యలో ప్రమోషన్ కోసం డబ్బులు అవసరమైతే.. తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తనను వదిలేయాలని వేడుకున్నా వదిలిపెట్టలేదు. పోనీ పెళ్లి చేసుకోవాలని కోరితే.. ముఖం చాటేశాడు. అంటే.. అటు వదిలి పెట్టడు.. ఇటు పెళ్లి చేసుకోడు.. తన జీవితం అన్యాయం అయ్యేలా ప్రవర్తించాడని మహిళ ఆరోపిస్తోంది.
మానసికంగా వేధిస్తున్న సీఐ రాజు నాయక్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ ప్రయత్నించింది. మే 7న ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళితే.. కేసు తీసుకోలేదని.. పోలీసులు తన ఆవేదనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. ఐతే అప్పటికే ఫిర్యాదు గురించి తెలుసుకున్న రాజు నాయక్.. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించాడు. కేసు నమోదు కాకుండా చూసుకున్నాడు. అంతే కాదు.. అప్పటికే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు అతన్ని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మరోవైపు తనకు న్యాయం చేయాలని మహిళ ఉన్నతాధికారులను వేడుకుంటోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!