CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- ఖమ్మం సీసీఎస్లో సీఐగా పని చేస్తున్నాడు..
- ఓ మహిళపట్ల కీచకుడిగా మారాడు..
- ఫోన్ నంబర్ తీసుకుని.. సాయం చేసినట్లు డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ కేసులో న్యాయం చేయాలని కోరిన మహిళను చేరదీశాడు.. ఆమెను బెదిరించి సహజీవనం చేశాడు.. రెండుసార్లు అబార్షన్ చేయించాడు.. పెళ్లి చేసుకోవాలని అడిగితే.. కాదు పొమ్మన్నాడు.. ఇదీ ఖమ్మం జిల్లాలో ఓ సీఐ చేసిన నిర్వాకం. ఫిర్యాదు చేద్దామని వెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళ ఆరోపిస్తోంది. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించి.. ఆ కీచక సీఐ కేసు కాకుండా చూస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రాజు నాయక్. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్లో సీఐగా పని చేస్తున్నాడు. వృత్తిరీత్యా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఈయన.. ఓ మహిళపట్ల కీచకుడిగా మారాడు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాల దృష్ట్యా.. సాయం చేయాలని వేడుకున్న ఆ మహిళను ట్రాప్ చేశాడు. ఫోన్ నంబర్ తీసుకుని.. సాయం చేసినట్లు నటిస్తూనే ఆమెను తన ఉచ్చులోకి లాగాడు. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి ఆమెను వేధించి.. వెంటాడిన సీఐ రాజునాయక్..ఎట్టకేలకు ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చింది. రెండుసార్లు కూడా ఆమెకు అబార్షన్ చేయించాడు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
అంతేకాదు.. ఆ మహిళ కాపురాన్ని సెట్ చేస్తానని చెప్పిన సీఐ రాజు నాయక్ నిర్వాకాలు మామూలుగా లేవు. ఆమెకు ఆమె భర్తతో విడాకులు ఇప్పించాడు. అందుకోసం లాయర్ను కూడా తానే మాట్లాడాడు. మధ్యలో ప్రమోషన్ కోసం డబ్బులు అవసరమైతే.. తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. తనను వదిలేయాలని వేడుకున్నా వదిలిపెట్టలేదు. పోనీ పెళ్లి చేసుకోవాలని కోరితే.. ముఖం చాటేశాడు. అంటే.. అటు వదిలి పెట్టడు.. ఇటు పెళ్లి చేసుకోడు.. తన జీవితం అన్యాయం అయ్యేలా ప్రవర్తించాడని మహిళ ఆరోపిస్తోంది.
మానసికంగా వేధిస్తున్న సీఐ రాజు నాయక్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ ప్రయత్నించింది. మే 7న ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళితే.. కేసు తీసుకోలేదని.. పోలీసులు తన ఆవేదనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. ఐతే అప్పటికే ఫిర్యాదు గురించి తెలుసుకున్న రాజు నాయక్.. పోలీస్ శాఖలో తన పలుకుబడి ఉపయోగించాడు. కేసు నమోదు కాకుండా చూసుకున్నాడు. అంతే కాదు.. అప్పటికే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు అతన్ని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మరోవైపు తనకు న్యాయం చేయాలని మహిళ ఉన్నతాధికారులను వేడుకుంటోంది.
తాజావార్తలు
-
PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
-
Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్చుక్
-
Astrology: జూలై 24 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?