Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thotakura Masala Vada Recipe: సాయంత్రం వేళల్లో వేడివేడిగా, కరకరలాడే స్నాక్స్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి? సాధారణంగా మనం రోడ్డు పక్కన బండ్ల మీద దొరికే మసాలా వడలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే అదే రుచితో, ఆరోగ్యకరమైన ఆకుకూరలను జోడించి ఇంట్లోనే ఎంతో సులువుగా “తోటకూర మసాలా వడలు” ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ విధంగా వడలు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు:
* పచ్చి శనగపప్పు – పావు కిలో (250 గ్రాములు)
* తోటకూర – 2 కట్టలు (చాలా సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి – 7 నుండి 8
* ఉల్లిపాయ – 1 (మధ్యస్థ పరిమాణంలో ఉన్నది, సన్నగా తరిగినది)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
* జీలకర్ర – 1 టీస్పూన్
* కరివేపాకు – 1 రెమ్మ
* ఉప్పు – రుచికి సరిపడా
* నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
తయారీ విధానం:
పప్పు నానబెట్టడం & గ్రైండ్ చేయడం:
మొదటగా పచ్చి శనగపప్పును రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని, తగినన్ని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ సమయం తక్కువగా ఉంటే, వేడి నీళ్లలో ముప్పావు గంట నానబెడితే సరిపోతుంది. పప్పు బాగా నానిన తర్వాత, నీళ్లేమీ లేకుండా పూర్తిగా వడకట్టి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల వడలు తినేటప్పుడు అక్కడక్కడా శనగపప్పు తగులుతూ భలే కరకరలాడుతుంటాయి.
మసాలా మిశ్రమం:
గ్రైండ్ చేసుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే, పప్పు గ్రైండ్ చేసేటప్పుడే ఒక ఇంచ్ అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తుంచిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చివరగా, శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులో వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా చేత్తో గట్టిగా కలుపుకోవాలి. తోటకూర ఎంత సన్నగా తరిగితే వడలు వేసేటప్పుడు అంత బాగా వస్తాయి. ఈ మిశ్రమానికి అస్సలు నీళ్లు కలపకూడదు. ఒకవేళ పొరపాటున నీళ్లు ఎక్కువై మిశ్రమం మెత్తగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలుపుకోవచ్చు.
వడలు కాల్చడం:
స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత, సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమం నుండి కొద్దికొద్దిగా తీసుకుంటూ చేతిలోనే నేరుగా వడల్లా ఒత్తుకుని నూనెలో వేసుకోవాలి. వడలను ఎప్పుడూ మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల వడలు లోపలి వరకు చక్కగా ఉడికి, ఎక్కువ సమయం పాటు కరకరలాడుతూ ఉంటాయి. రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి, క్రిస్పీగా మారిన వెంటనే నూనె నుండి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి మార్చుకోవాలి.
అంతే.. ఎంతో రుచికరమైన, వేడివేడి స్ట్రీట్ స్టైల్ తోటకూర మసాలా వడలు సిద్ధం. సాయంత్రం పూట టీతో పాటు ఈ వడలను తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని ఇంట్లో ప్రయత్నించి చూడండి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!