Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. చెక్ పోస్టుల రద్దు, మైక్రో బ్రూవరీస్కు గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ కేబినెట్ 25 అంశాలపై చర్చ
- అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
- వాహనాల మానిటరింగ్లో ఆధునిక సాంకేతికత వినియోగం
- మైక్రో బ్రూవరీస్కు కేబినెట్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet : హైదరాబాద్లో సోమవారం ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రవాణా, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి విభాగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య నిర్ణయంగా, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ తేల్చింది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా అన్ని రాష్ట్రాలకు చెక్ పోస్టులను తొలగించాలన్న సూచనలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెక్ పోస్టులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలను పరిశీలించేందుకు చెక్ పోస్టు సిబ్బందిని ఉంచడం కాకుండా, ఆధునిక ‘వాహన్’ సాఫ్ట్వేర్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగించనుంది.
Also Read
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
Trump: ట్రంప్ నోట మళ్లీ అదే మాట.. నేను అడ్డుకోకపోతే భారత్-పాక్ యుద్ధంలో ఉండేవి
అదేవిధంగా, రాష్ట్ర పట్టణాభివృద్ధి రంగానికి సంబంధించిన ముఖ్య నిర్ణయం తీసుకుంది. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మైక్రో బ్రూవరీస్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర రవాణా రంగంలో సులభతరం , ఆధునీకరణ దిశగా ముందడుగుగా భావించబడుతున్నాయి. అదే సమయంలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుతో పట్టణాలలో వినోదం, పర్యాటక రంగాలకు కొత్త ఉత్సాహం కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!
తాజావార్తలు
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!