Trump: ట్రంప్ నోట మళ్లీ అదే మాట.. నేను అడ్డుకోకపోతే భారత్-పాక్ యుద్ధంలో ఉండేవి
- ట్రంప్ నోట మళ్లీ అదే మాట
- నేను అడ్డుకోకపోతే భారత్-పాక్ యుద్ధంలో ఉండేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్లీ ట్రంప్ ప్రకటించారు. స్కాట్లాండ్లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని లేవనెత్తారు. తన జోక్యంతోనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిందని.. లేదంటే ఇప్పటికీ రెండు దేశాలు యుద్ధాలు చేసుకునేవని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే సోమవారం పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కేంద్ర పెద్దలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యాన్ని తోసిపుచ్చాయి. మూడోవ్యక్తి ప్రమేయం లేదని.. ఇరుదేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కానీ తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. తానే యుద్ధాన్ని ఆపినట్లుగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను ఆపివేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: S Jaishankar: ఆపరేషన్ సిందూర్కు ముందు ఏం జరిగిందంటే..!
Also Read
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
‘‘భారత్-పాకిస్థాన్ ఘర్షణ చాలా పెద్దది. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు. అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే దారుణ పరిస్థితులు నెలకొనేవి. ఇరుదేశాల నేతలు నాకు బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే.. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పాను. బెదిరించడంతోనే కాల్పుల విరమణ చేసుకున్నాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశం-పాకిస్థాన్ మధ్య సహా ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను నిరోధించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!
ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మతం పేరుతో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. భార్య, పిల్లల ఎదుటే భర్తలను చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వంద మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసింది. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సైన్యం ఎప్పటి నుంచి వేటాడుతోంది. అనూహ్యంగా సోమవారం పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్పై చర్చ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదుల్ని ఆశ్చర్యంగా సైన్యం హతమార్చింది.
తాజావార్తలు
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!