Ponnam Prabhakar : బలహీన వర్గాల నోటి కాడి ముద్ద లాగొద్దు
- 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసిన మంత్రి
- కుల సర్వే ఆధారంగా తీసుకున్న కీలక నిర్ణయం
- రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని హామీ
- బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుల గణన సర్వే నిర్వహించామని, ఆ సర్వే ఆధారంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెంచే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయానికి చట్టసభలలో అన్ని పార్టీల మద్దతు లభించిందని, మూడ్ ఆఫ్ హౌజ్ తీసుకున్న తర్వాతే బిల్లు ఆమోదించబడి గవర్నర్కు పంపించామని చెప్పారు. అనంతరం గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారని తెలిపారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తమిళనాడు ఉదాహరణను ప్రస్తావిస్తూ, గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలు కూడా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని పొన్నం గుర్తు చేశారు. దాని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసిందని అన్నారు. “10 శాతం EWS రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవ్వరూ వ్యతిరేకించలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని మంత్రి హామీ ఇచ్చారు.
“రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం. మా నోటి కాడి ముద్ద లాగవద్దు. తెలంగాణ సమాజం మొత్తం కలిసి ఈ రిజర్వేషన్లను కాపాడుకోవాలి. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్” అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గతంలో బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. “పది ఏళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారు, ఎంతమందికి మూడు ఎకరాల భూమి ఇచ్చారు? కవిత స్వయంగా చెప్పినట్టుగా వాళ్ల ఇళ్ళలో బంగారం ఉంటే తెలంగాణ అంతా బంగారం కాలేదు” అంటూ ఎద్దేవా చేశారు.
Musi River : పురానాపూల్ వంతెన వద్ద ప్రమాద స్థాయిని దాటిన వరద
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?