KTR: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ కోసం ధైర్యంగా పార్టీ పెట్టి నాయకుడు కేటీఆర్..
- బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్తకాదు..
- రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటింది మొదట ఎన్టీఆర్.. ఆ తరువాత కేసీఆర్ అని తెలిపారు. గులాబీ జెండా లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా సమర్థవంతంగా నిలబడింది.. విజయవంతంగా ఉద్యమం, సమర్థవంతమైన పాలన అందించింది బీఆర్ఎస్ పార్టీ.. తమ పాలన తెలంగాణ రాష్ట్రానికి అవసరం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు.. కానీ, ప్రజల ఆశీర్వాదంతో నిలబడ్డాం.. సీఎం పర్సంటేజ్ లు పెంచుకుంటున్నారు.. అసూయ, ద్వేషం, ఆశలను మాపై ప్రచారం చేయడంతో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు.
Read Also: AP Legislative Council: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని పీపీపీ మోడ్లో నిర్మిస్తాం!
Also Read
ఇక, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్త కాదు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అహంకారి, దోర అని విష ప్రచారం చేశారని అన్నారు.. 30 వేల రుణ మాఫీ డబ్బులు డిల్లీ పెద్దలకు చేరినాయి.. సూర్యాపేట జిల్లాకు సాగు నీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే, బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారమే.. ప్రజల అభిమానం కాదు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకు ఏనాటికైనా శత్రువే.. బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రేవంత్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. బండెనక బండి కట్టి.. ఏప్రిల్ 27న వరంగల్ సభకు ప్రజలు కదిలి రావాలి.. అసెంబ్లీ లో జగదీష్ రెడ్డి మంట్లడిందాంట్లో తప్పులేదు.. స్పీకర్ కు కులం ఆపాదించడం దురదృష్టకరం.. గడ్డం ప్రసాద్ స్పీకర్ కావాలని బీఆర్ఎస్ పోటీ కూడా పెట్టలేదు.. అసెంబ్లీనీ గాంధీభవన్ తో పోల్చిన ఎంఐఎంపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- BRS
- congress
- ktr
- revanth reddy
- Suryapet
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!