KTR: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ కోసం ధైర్యంగా పార్టీ పెట్టి నాయకుడు కేటీఆర్..
- బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్తకాదు..
- రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటింది మొదట ఎన్టీఆర్.. ఆ తరువాత కేసీఆర్ అని తెలిపారు. గులాబీ జెండా లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా సమర్థవంతంగా నిలబడింది.. విజయవంతంగా ఉద్యమం, సమర్థవంతమైన పాలన అందించింది బీఆర్ఎస్ పార్టీ.. తమ పాలన తెలంగాణ రాష్ట్రానికి అవసరం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్నారు.. కానీ, ప్రజల ఆశీర్వాదంతో నిలబడ్డాం.. సీఎం పర్సంటేజ్ లు పెంచుకుంటున్నారు.. అసూయ, ద్వేషం, ఆశలను మాపై ప్రచారం చేయడంతో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు.
Read Also: AP Legislative Council: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని పీపీపీ మోడ్లో నిర్మిస్తాం!
Also Read
ఇక, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్త కాదు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అహంకారి, దోర అని విష ప్రచారం చేశారని అన్నారు.. 30 వేల రుణ మాఫీ డబ్బులు డిల్లీ పెద్దలకు చేరినాయి.. సూర్యాపేట జిల్లాకు సాగు నీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే, బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారమే.. ప్రజల అభిమానం కాదు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకు ఏనాటికైనా శత్రువే.. బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రేవంత్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. బండెనక బండి కట్టి.. ఏప్రిల్ 27న వరంగల్ సభకు ప్రజలు కదిలి రావాలి.. అసెంబ్లీ లో జగదీష్ రెడ్డి మంట్లడిందాంట్లో తప్పులేదు.. స్పీకర్ కు కులం ఆపాదించడం దురదృష్టకరం.. గడ్డం ప్రసాద్ స్పీకర్ కావాలని బీఆర్ఎస్ పోటీ కూడా పెట్టలేదు.. అసెంబ్లీనీ గాంధీభవన్ తో పోల్చిన ఎంఐఎంపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ కు లేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- BRS
- congress
- ktr
- revanth reddy
- Suryapet
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?