Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Crime News Fake Gold Coins Scam Trader Cheated Rs 20 Lakhs Suryapet

Crime News: కుండలో బంగారు నాణేలు దొరికాయని.. రూ.20 లక్షలు టోకరా! చివరికి ఏమైందంటే?

Published Date :August 26, 2025 , 9:50 pm
By Sampath Kumar
  • సూర్యాపేట జిల్లా చివ్వెంలలో మోసం
  • బంగారు నాణేల పేరుతో వ్యాపారిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు
  • వ్యాపారికి రూ.20 లక్షలు టోకరా వేసిన కేటుగాళ్లు
  • కోడి రక్తం ఒళ్లంతా పూసుకుని గాయాలు అంటూ నాటకం
Crime News: కుండలో బంగారు నాణేలు దొరికాయని.. రూ.20 లక్షలు టోకరా! చివరికి ఏమైందంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తేరగా డబ్బులు సంపాదించే వారు ఓ వైపు.. దురాశతో సంపాదిద్దామనుకునే వారు మరోవైపు.. వీరిద్దరి మధ్య బంధం ఫెవికాల్‌ కంటే గట్టిగానే ఏర్పడుతుంది. కానీ చివరకు అందులో నుంచి మోసం వెలుగులోకి వస్తుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో సరిగ్గా ఇలాగే జరిగింది. బంగారు నాణేల పేరుతో ఓ వ్యాపారిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. 20 లక్షల రూపాయలు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.

చివ్వెంల మండలం తుమ్మలపెంపహాడ్‌కు చెందిన పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న, పసుపుల సత్యం, పసుపుల నవీన్, ఓర్సు శ్రీను, ఓర్సు గోపమ్మ, పసుపుల లక్ష్మీ, మద్దంగుల అంజలి ఓ ముఠాగా ఏర్పడ్డారు. అదే గ్రామానికి చెందిన నిమ్మనగోటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. అతను ఆర్ధికంగా స్థితిమంతుడు కావడం.. పైగా అతనికి డబ్బుపై మక్కువ ఉండడంతో అతన్ని టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఇంకేముంది తాము అనుకున్న పనిపై ప్రొసీడ్ అయ్యారు.

తమకు పురాతన కాలం నాటి కుండలో బంగారు నాణేలు దొరికాయని.. ఓ కట్టు కథ సృష్టించారు. వాటిని తక్కువ ధరకే అమ్ముతామని నమ్మబలికారు. అప్పటికే హోటల్ వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు.. వారు ఊహించిన విధంగానే తక్కువ ధరకే బంగారం వస్తుండడంతో ఆశపడ్డాడు. దీంతో రూ. 20 లక్షలు ఇచ్చి బంగారు నాణేలు కొనుగోలు చేసేలా అతనితో డీల్ కుదుర్చుకున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం రూ.5 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు వెంకటేశ్వర్లు. ఆగస్టు 11న మిగతా సొమ్ము 15 లక్షలు ఇచ్చేశాడు. దీంతో మొత్తం 20 లక్షల రూపాయల చెల్లింపు పూర్తయింది.

అంతా బాగానే ఉంది. ఇక బంగారు నాణేల కోసం ఎదురు చూస్తున్నాడు వెంకటేశ్వర్లు. కానీ తనకు గోల్డ్ కాయిన్స్ ఇస్తామన్న ముఠా జాడ కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లుకు అనుమానం స్టార్ట్ అయింది. గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలని వారికి కాల్ చేశాడు. కానీ ఈసారి మరో స్కెచ్చేశారు కేటుగాళ్లు. తమపై దోపిడీ దొంగలు దాడి చేశారని.. రూ.20 లక్షలు దోచుకెళ్లారని చెప్పారు. అందుకు సాక్ష్యంగా.. తాము గాయాలతో ఉన్న ఓ వీడియోను వెంకటేశ్వర్లుకు పంపించారు. నిజానికి కోడి రక్తం ఒళ్లంతా పూసుకుని గాయాలు అయినట్లుగా బిల్డప్ ఇచ్చారు. పైగా రూ.20 లక్షలు పోయిన టెన్షన్‌లో ఉన్నామని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఊరుకోలేదు.. గాయాలకు చికిత్స చేసేందుకు రూ.10వేలు ఫోన్ పే చేయాలని కోరారు. అప్పటికి కూడా నిజమని నమ్మిన వెంకటేశ్వర్లు రూ.10వేలు చెల్లించాడు.

చివరకు తాను మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో మొత్తం 9 మంది నిందితుల్లో పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న, పసుపుల సత్యంను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 లక్షల 25 వేల నగదును, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఐదుగురు నిందితులు పసుపుల నవీన్, ఓర్సు శ్రీను, ఓర్సు గోపమ్మ, పసుపుల లక్ష్మీ, మద్దంగుల అంజలి పరారీలో ఉన్నారు. ఇలా పురాతన బంగారు నాణేలు తక్కువ ధరకు ఇస్తామని ఎవరైనా చెబితే.. అది కచ్చితంగా మోసమేనని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎవరైనా ఇస్తే.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chivvemla
  • Chivvemla Crime News
  • Chivvemla Fake Gold Coins
  • Crime News
  • Fake Gold Coins

తాజావార్తలు

  • Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

  • తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!

  • Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!

  • Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!

  • AP Capital Amaravati: అమరావతి రాజధానిగా హర్షం.. కానీ ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు? APJAC సూటి ప్రశ్న.!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions