Crime News: కుండలో బంగారు నాణేలు దొరికాయని.. రూ.20 లక్షలు టోకరా! చివరికి ఏమైందంటే?
- సూర్యాపేట జిల్లా చివ్వెంలలో మోసం
- బంగారు నాణేల పేరుతో వ్యాపారిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు
- వ్యాపారికి రూ.20 లక్షలు టోకరా వేసిన కేటుగాళ్లు
- కోడి రక్తం ఒళ్లంతా పూసుకుని గాయాలు అంటూ నాటకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తేరగా డబ్బులు సంపాదించే వారు ఓ వైపు.. దురాశతో సంపాదిద్దామనుకునే వారు మరోవైపు.. వీరిద్దరి మధ్య బంధం ఫెవికాల్ కంటే గట్టిగానే ఏర్పడుతుంది. కానీ చివరకు అందులో నుంచి మోసం వెలుగులోకి వస్తుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో సరిగ్గా ఇలాగే జరిగింది. బంగారు నాణేల పేరుతో ఓ వ్యాపారిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. 20 లక్షల రూపాయలు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.
చివ్వెంల మండలం తుమ్మలపెంపహాడ్కు చెందిన పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న, పసుపుల సత్యం, పసుపుల నవీన్, ఓర్సు శ్రీను, ఓర్సు గోపమ్మ, పసుపుల లక్ష్మీ, మద్దంగుల అంజలి ఓ ముఠాగా ఏర్పడ్డారు. అదే గ్రామానికి చెందిన నిమ్మనగోటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. అతను ఆర్ధికంగా స్థితిమంతుడు కావడం.. పైగా అతనికి డబ్బుపై మక్కువ ఉండడంతో అతన్ని టార్గెట్గా ఎంచుకున్నారు. ఇంకేముంది తాము అనుకున్న పనిపై ప్రొసీడ్ అయ్యారు.
Also Read
తమకు పురాతన కాలం నాటి కుండలో బంగారు నాణేలు దొరికాయని.. ఓ కట్టు కథ సృష్టించారు. వాటిని తక్కువ ధరకే అమ్ముతామని నమ్మబలికారు. అప్పటికే హోటల్ వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు.. వారు ఊహించిన విధంగానే తక్కువ ధరకే బంగారం వస్తుండడంతో ఆశపడ్డాడు. దీంతో రూ. 20 లక్షలు ఇచ్చి బంగారు నాణేలు కొనుగోలు చేసేలా అతనితో డీల్ కుదుర్చుకున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం రూ.5 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు వెంకటేశ్వర్లు. ఆగస్టు 11న మిగతా సొమ్ము 15 లక్షలు ఇచ్చేశాడు. దీంతో మొత్తం 20 లక్షల రూపాయల చెల్లింపు పూర్తయింది.
అంతా బాగానే ఉంది. ఇక బంగారు నాణేల కోసం ఎదురు చూస్తున్నాడు వెంకటేశ్వర్లు. కానీ తనకు గోల్డ్ కాయిన్స్ ఇస్తామన్న ముఠా జాడ కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లుకు అనుమానం స్టార్ట్ అయింది. గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలని వారికి కాల్ చేశాడు. కానీ ఈసారి మరో స్కెచ్చేశారు కేటుగాళ్లు. తమపై దోపిడీ దొంగలు దాడి చేశారని.. రూ.20 లక్షలు దోచుకెళ్లారని చెప్పారు. అందుకు సాక్ష్యంగా.. తాము గాయాలతో ఉన్న ఓ వీడియోను వెంకటేశ్వర్లుకు పంపించారు. నిజానికి కోడి రక్తం ఒళ్లంతా పూసుకుని గాయాలు అయినట్లుగా బిల్డప్ ఇచ్చారు. పైగా రూ.20 లక్షలు పోయిన టెన్షన్లో ఉన్నామని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఊరుకోలేదు.. గాయాలకు చికిత్స చేసేందుకు రూ.10వేలు ఫోన్ పే చేయాలని కోరారు. అప్పటికి కూడా నిజమని నమ్మిన వెంకటేశ్వర్లు రూ.10వేలు చెల్లించాడు.
చివరకు తాను మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో మొత్తం 9 మంది నిందితుల్లో పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న, పసుపుల సత్యంను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 లక్షల 25 వేల నగదును, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఐదుగురు నిందితులు పసుపుల నవీన్, ఓర్సు శ్రీను, ఓర్సు గోపమ్మ, పసుపుల లక్ష్మీ, మద్దంగుల అంజలి పరారీలో ఉన్నారు. ఇలా పురాతన బంగారు నాణేలు తక్కువ ధరకు ఇస్తామని ఎవరైనా చెబితే.. అది కచ్చితంగా మోసమేనని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎవరైనా ఇస్తే.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!