Youth Arrested: చోరీలు చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డ ఎపీకీ చెందిన యువకుడు
- పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో..
- ఈజీ మనీ కోసం చోరీ చేసిన యువకుడు
- హుజూర్నగర్ మండలం వేపలసింగారంలో చోరీ
- సీసీపుటేజీ ద్వారా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ఏపీకి చెందిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం తెలంగాణలో చోరీలు చేస్తూ పట్టుబడ్డాడు. అయితే నిందితుడు పోటీ పరీక్షలు రాసినా.. ఉద్యోగం రాకపోవడంతో.. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. అయితే సూర్యాపేట జిల్లాలోని వేపల సింగారంలో చోరీ చేసి పారిపోతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పీఎస్ కు తరలించారు.
Read Also: Suicide: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..
Also Read
- Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
- Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
పూర్తి వివరాల్లోకి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన పెనుగొండ మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. కాంపీటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయినప్పటికి ఉద్యోగం రాలేదు. దీంతో జల్సాలు, ఈజీ మనీ కోసం చోరీలు చేస్తున్నాడు. అయితే దొంగతనం చేసిన సొమ్ముతో బెట్టింగ్ ఆడి.. డబ్బులు పొగొట్టుకునే వాడు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారంలో దొంగతనానికి పాల్పడ్డాడు. గ్రామంలోని ముడెం గోపిరెడ్డి ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మల్లికార్జున్ రెడ్డి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదు దొంగిలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుజూర్నగర్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also:Electric Bike: హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
చోరీ చేసిన సొమ్మును అమ్మేందుకు వెళుతుండగా.. అక్కడే వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో మల్లికార్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి నగదు, బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడి నుంచి 51.78 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,85,000 నగదు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!