Spring Fields: 800 ఏళ్ల ఇస్లామిక్ స్వర్ణయుగాన్ని ప్రదర్శించిన స్ప్రింగ్ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spring Fields: 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య కాలం మానవజాతి చరిత్రలో ఆర్థిక, సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి విశేషమైన కాలమే ఇస్లాం స్వర్ణయుగం. ఇస్లాం పెరుగుదల, వ్యాప్తి ఒక గొప్ప శాస్త్రీయ, మేధో విప్లవాన్ని ప్రేరేపించింది. ముస్లిం శాస్త్రవేత్తలు గణిత శాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రం, ఆప్టిక్స్, రసాయన శాస్త్రంలో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. కానీ 800 సంవత్సరాల ఈ గొప్ప వారసత్వం యూరో-కేంద్రీకృత సంస్కృతితో కప్పివేయబడింది. ఇస్లాంకు సంబంధించిన చాలా ఆవిష్కరణలు ఈ రోజు ప్రజలకు చాలా తక్కువమందికే తెలుసు. ఈ నేపథ్యంలో స్ప్రింగ్ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ ముస్లిం శాస్త్రవేత్తల సహకారం, గణితం, సైన్స్, లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లైఫ్స్టైల్ రంగాలలో వారి ఆవిష్కరణలను మోడల్స్, కళాఖండాలు, విద్యార్థుల ప్రదర్శనల గ్రాండ్ ఎగ్జిబిషన్లో ప్రతి సందర్శకుడికి సుసంపన్నమైన అనుభవాన్ని వాగ్దానం చేస్తోంది.

Also Read
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ఈ ఎగ్జిబిషన్ను యునెస్కో మాజీ అధ్యక్షుడు అష్గర్ హుస్సేన్, తెలంగాణ ప్రభుత్వ TMREIS అకాడమిక్ హెడ్ ఎంఎ. లతీఫ్ అతీర్, స్ప్రింగ్ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్, జయాన్ బాబుఖాన్ ప్రారంభించారు. స్ప్రింగ్ఫీల్డ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ ఆలోచన, అతీర్ మద్దతుతో ఎగ్జిబిషన్ నిర్వహించబడింది. మిస్టర్ అష్గర్ హుస్సేన్ విద్యార్థుల విస్తృత పరిశోధన, ప్రదర్శనను ప్రశంసించారు. అతను ప్రసిద్ధ ఇస్లామిక్ ఆవిష్కరణల గురించి మాట్లాడారు. డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ మాట్లాడుతూ మన గొప్ప వారసత్వం గురించి మనం గర్వపడాలన్నారు. ఈ వారసత్వానికి మనం కనెక్ట్ అవ్వాలని.. అందరికీ కమ్యూనికేట్ చేస్తూ సహకరించాలని సూచించారు. లతీఫ్ అతీర్ తన పరిశోధన గురించి మాట్లాడుతూ.. ముస్లిం శాస్త్రవేత్తలపై మొట్టమొదటి ప్రదర్శన చేయడానికి తమ దివంగత వ్యవస్థాపక డైరెక్టర్ బషీరుద్దీన్ బాబుఖాన్ తనను ప్రేరేపించారని, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక ప్రదర్శనలను మెరుగుపరచడం, నిర్వహించడం కొనసాగించారని తెలిపారు. ఈ ప్రదర్శనకు 60కి పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు మీడియా మానియా పిఆర్ జి.జయరాంను 9010574196 నంబరులో సంప్రదించవచ్చు.
Read Also: Coronavirus : కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!