Spring Fields: 800 ఏళ్ల ఇస్లామిక్ స్వర్ణయుగాన్ని ప్రదర్శించిన స్ప్రింగ్ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spring Fields: 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య కాలం మానవజాతి చరిత్రలో ఆర్థిక, సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి విశేషమైన కాలమే ఇస్లాం స్వర్ణయుగం. ఇస్లాం పెరుగుదల, వ్యాప్తి ఒక గొప్ప శాస్త్రీయ, మేధో విప్లవాన్ని ప్రేరేపించింది. ముస్లిం శాస్త్రవేత్తలు గణిత శాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రం, ఆప్టిక్స్, రసాయన శాస్త్రంలో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. కానీ 800 సంవత్సరాల ఈ గొప్ప వారసత్వం యూరో-కేంద్రీకృత సంస్కృతితో కప్పివేయబడింది. ఇస్లాంకు సంబంధించిన చాలా ఆవిష్కరణలు ఈ రోజు ప్రజలకు చాలా తక్కువమందికే తెలుసు. ఈ నేపథ్యంలో స్ప్రింగ్ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ ముస్లిం శాస్త్రవేత్తల సహకారం, గణితం, సైన్స్, లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లైఫ్స్టైల్ రంగాలలో వారి ఆవిష్కరణలను మోడల్స్, కళాఖండాలు, విద్యార్థుల ప్రదర్శనల గ్రాండ్ ఎగ్జిబిషన్లో ప్రతి సందర్శకుడికి సుసంపన్నమైన అనుభవాన్ని వాగ్దానం చేస్తోంది.

Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ఈ ఎగ్జిబిషన్ను యునెస్కో మాజీ అధ్యక్షుడు అష్గర్ హుస్సేన్, తెలంగాణ ప్రభుత్వ TMREIS అకాడమిక్ హెడ్ ఎంఎ. లతీఫ్ అతీర్, స్ప్రింగ్ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్, జయాన్ బాబుఖాన్ ప్రారంభించారు. స్ప్రింగ్ఫీల్డ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ ఆలోచన, అతీర్ మద్దతుతో ఎగ్జిబిషన్ నిర్వహించబడింది. మిస్టర్ అష్గర్ హుస్సేన్ విద్యార్థుల విస్తృత పరిశోధన, ప్రదర్శనను ప్రశంసించారు. అతను ప్రసిద్ధ ఇస్లామిక్ ఆవిష్కరణల గురించి మాట్లాడారు. డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ మాట్లాడుతూ మన గొప్ప వారసత్వం గురించి మనం గర్వపడాలన్నారు. ఈ వారసత్వానికి మనం కనెక్ట్ అవ్వాలని.. అందరికీ కమ్యూనికేట్ చేస్తూ సహకరించాలని సూచించారు. లతీఫ్ అతీర్ తన పరిశోధన గురించి మాట్లాడుతూ.. ముస్లిం శాస్త్రవేత్తలపై మొట్టమొదటి ప్రదర్శన చేయడానికి తమ దివంగత వ్యవస్థాపక డైరెక్టర్ బషీరుద్దీన్ బాబుఖాన్ తనను ప్రేరేపించారని, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక ప్రదర్శనలను మెరుగుపరచడం, నిర్వహించడం కొనసాగించారని తెలిపారు. ఈ ప్రదర్శనకు 60కి పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు మీడియా మానియా పిఆర్ జి.జయరాంను 9010574196 నంబరులో సంప్రదించవచ్చు.
Read Also: Coronavirus : కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!