South Central Railway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: తిరుమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లను ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు పొడిగించారు. కాచిగూడ, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్లకు పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-తిరుపతి (07061) రైలు 8వ తేదీన, తిరుపతి-కాచిగూడ (07062) రైలు 9వ తేదీన సేవలు అందిస్తాయి. ఈ రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
Read also: Vande Bharat Train: త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్.. రామగుండంలో స్టేషన్
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
10న కాచిగూడ-కాకినాడ టౌన్ (07417) రైలు, 11న కాకినాడ టౌన్-కాచిగూడ (07418) రైలు నడుస్తుంది. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ-నారాపూర్ (రైలు నెం. 07653) ప్రతి గురువారం 8 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది. నర్సాపూర్-కాచిగూడ (07654) రైలు ప్రతి శుక్రవారం 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ టూ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. దీంతో తిరుమల వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో అధికారులు తిరుమలకు నిత్యం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
NBK 108: టైటిల్ రివీల్ కే గాల్లోకి లేపుతున్నారుగా?
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?