MP Dr. Laxman: బూతద్దం పెట్టీ వెతికినా.. మోడీకి సరి తూగే వ్యక్తి దొరకరు..
MP Dr. Laxman: బూతద్దం పెట్టీ వెతికినా.. మోడీకి సరి తూగే వ్యక్తి దొరకరని రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ బీజేపీ యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం యూనిఫాం సివిల్ కోడ్ కోసం ఎదురు చూస్తుందన్నారు. మూడో సారి మోడీ ప్రధాని అవ్వగానే యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరుగుతుందన్నారు. దేశానికి ప్రధాని ఎవరు కావాలని ఎదురు చూస్తున్న ఎన్నికలు ఇవి అన్నారు. మోడీకి సరితుగే నాయకులే లేరన్నారు. బూతద్దం పెట్టీ వెతికినా మోది కి సరి తూగే వ్యక్తి దొరకరన్నారు. దేశానికి యువతే వెన్నెముక.. ఆ యువత మొత్తం మోడీ వెంట ఉన్నారన్నారు. యువతకి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించేది మోడీ నే అన్నారు. మోడీకి ఉన్న ముందు చూపుతో వనరులు పెట్టుబడిగా పెట్టు దేశానికి వనరులు సృష్టిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయంలో భారత దేశం ఆర్థికంగా ప్రపంచంలో 11 వ స్థానంలో ఉండేదన్నారు. ఇప్పుడు మోడీ హాయంలో 5 వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు.
Read also: Congress : రాయ్బరేలీ, అమేథీపై కాంగ్రెస్ కీలక నిర్ణయం, పరిశీలకులుగా ఇద్దరు మాజీ సీఎంలు
Also Read
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ముద్ర లోన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించింది కూడా మోడీ నే అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉపాధి పొందేందుకు మోడీ కృషి చేశాడన్నారు. స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటుగా ఉండి యువతకు మోది సహకారం అందించాడని తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ అవుతుంది అంటే అది మోడీ ముందు చూపే అన్నారు. డిజిటల్ ఇండియా కోసం మోడీ చేసిన కృషి ఫలితమే ఈ దళారీ వ్యవస్థ నుండి విముక్తి అన్నారు. కాంగ్రెస్ మత పరమైన రాజకీయాలు చేస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ కూడా మతపరమైన రిజర్వేషన్లు లేకుండే అన్నారు. కాంగ్రెస్ మొదటి సారి మైనార్టీలకు రిజర్వేషన్ అందించిందన్నారు. కుల పరమైన రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అప్పట్లో నెహ్రూ కూడా ప్రయత్నించారన్నారు. యువత మేల్కొని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను తిప్పి కొట్టాలన్నారు. హైదరాబాద్ లో 70% ఓటింగ్ నమోదు అయ్యేలా చూసే బాధ్యత యువత తీసుకోవాలని తెలిపారు. సికింద్రబాద్ లో కిషన్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.?
- Tags
- bjp
- BRS
- CM Revanth Reddy
- kcr
- ktr
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో