MP Dr. Laxman: బూతద్దం పెట్టీ వెతికినా.. మోడీకి సరి తూగే వ్యక్తి దొరకరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Dr. Laxman: బూతద్దం పెట్టీ వెతికినా.. మోడీకి సరి తూగే వ్యక్తి దొరకరని రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ బీజేపీ యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం యూనిఫాం సివిల్ కోడ్ కోసం ఎదురు చూస్తుందన్నారు. మూడో సారి మోడీ ప్రధాని అవ్వగానే యూనిఫాం సివిల్ కోడ్ అమలు జరుగుతుందన్నారు. దేశానికి ప్రధాని ఎవరు కావాలని ఎదురు చూస్తున్న ఎన్నికలు ఇవి అన్నారు. మోడీకి సరితుగే నాయకులే లేరన్నారు. బూతద్దం పెట్టీ వెతికినా మోది కి సరి తూగే వ్యక్తి దొరకరన్నారు. దేశానికి యువతే వెన్నెముక.. ఆ యువత మొత్తం మోడీ వెంట ఉన్నారన్నారు. యువతకి అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించేది మోడీ నే అన్నారు. మోడీకి ఉన్న ముందు చూపుతో వనరులు పెట్టుబడిగా పెట్టు దేశానికి వనరులు సృష్టిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయంలో భారత దేశం ఆర్థికంగా ప్రపంచంలో 11 వ స్థానంలో ఉండేదన్నారు. ఇప్పుడు మోడీ హాయంలో 5 వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు.
Read also: Congress : రాయ్బరేలీ, అమేథీపై కాంగ్రెస్ కీలక నిర్ణయం, పరిశీలకులుగా ఇద్దరు మాజీ సీఎంలు
Also Read
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
ముద్ర లోన్స్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించింది కూడా మోడీ నే అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉపాధి పొందేందుకు మోడీ కృషి చేశాడన్నారు. స్టార్టప్ కంపెనీలకు తోడ్పాటుగా ఉండి యువతకు మోది సహకారం అందించాడని తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధి దారుల ఖాతాలో నగదు జమ అవుతుంది అంటే అది మోడీ ముందు చూపే అన్నారు. డిజిటల్ ఇండియా కోసం మోడీ చేసిన కృషి ఫలితమే ఈ దళారీ వ్యవస్థ నుండి విముక్తి అన్నారు. కాంగ్రెస్ మత పరమైన రాజకీయాలు చేస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ కూడా మతపరమైన రిజర్వేషన్లు లేకుండే అన్నారు. కాంగ్రెస్ మొదటి సారి మైనార్టీలకు రిజర్వేషన్ అందించిందన్నారు. కుల పరమైన రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అప్పట్లో నెహ్రూ కూడా ప్రయత్నించారన్నారు. యువత మేల్కొని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను తిప్పి కొట్టాలన్నారు. హైదరాబాద్ లో 70% ఓటింగ్ నమోదు అయ్యేలా చూసే బాధ్యత యువత తీసుకోవాలని తెలిపారు. సికింద్రబాద్ లో కిషన్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.?
- Tags
- bjp
- BRS
- CM Revanth Reddy
- kcr
- ktr
తాజావార్తలు
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!