G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.? అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈనెల పదవ తేదీన మోడీ హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు మోడీ సభ ఉంటుందన్నారు. దేశం కోసం బీజేపీ రావాలి.. మోడీ రావాలి.. నరేంద్ర మోడీ దేశం కోసం ప్రధాని కావాలని అన్నారు. రాహుల్ గాంధీ ఆయన కోసం ప్రధాని కావాలని అనుకుంటున్నాడని తెలిపారు. మోడీ మోడీ అనే నినాదాలు ఇస్తే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్, సెక్రటేరియట్ లో ఉన్న రేవంత్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాలన్నారు. పదవ తేదీన యువత అంత బైకులపైన స్టేడియంకు కదిలి రావాలన్నారు. తొలి ఓటర్లు అంత ఉదయాన్నే వెళ్లి ఓటెయ్యాలన్నారు. కుటుంబ సభ్యులు.. ఫ్రెండ్స్ తో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లాలని తెలిపారు. పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు ఓటయ్యడానికి వెళ్తున్నామని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఓటేశాక.. మేము ఓటేశామని ఫోటో తీసి పెట్టి.. మీరంతా ఓటెయ్యండి అని క్యాప్షన్ పెట్టాలని పిలుపు నిచ్చారు.
Read also: CPI Narayana: అందాలు, ప్యాషన్ పోటీ పెడితే.. మోడీ కి ప్రథమ బహుమతి వస్తుంది..
Also Read
- SIR Phase-3 : దేశవ్యాప్తంగా 'SIR ఫేజ్-3' షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ఫ్యామిలీ.. ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఓటెయ్యాలి అని చెప్పాలన్నారు. యువతంతా ఓటెయ్యాలని మోడీ పిలునిచ్చారన్నారు. దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.? అని ప్రశ్నించారు. దేశంలో అభివృద్ధి కావాలా.? ఉగ్రవాదం కావాలా.? అని ప్రశ్నించారు. తొమిదిన్నర ఏళ్లలో జరిగిన ఏ విషయంలో అయిన చర్చకు సిద్ధమన్నారు. ఏ అంశం పైన అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ తో మేము చర్చకు సిద్ధమన్నారు. పాకిస్థాన్ వాళ్లు మన దేశంలో ఏం చేయాలి అనుకుంటే అది చేసేవాళ్లన్నారు. డెబ్బై ఏళ్లుగా పాకిస్థాన్ అరాచకాలు భరిస్తూ వచ్చామన్నారు. మన రక్తంతో పాకిస్థాన్ లో పండగలు చేసుకునే వాళ్లన్నారు. సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్థాన్ ఇంట్లోకి వెళ్లి ఉగ్రవాదులను పట్టుకున్నాం.. అంతమొందించామన్నారు. ప్రపంచంలో పాకిస్థాన్ ను ఏకాకిని చేసి.. బిచ్చం అడుక్కునే లాగా చేశాడు మోడీ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మన దేశ విద్యార్థులను తీసుకువచ్చాడు మోడీ తెలిపారు. ప్రపంచంలో యుద్ధాన్ని ఆపిన ఏకైక వ్యక్తి మోడీ అని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. దేశ భవిష్యత్తు కోసం మోడీకి ఓటెయ్యండన్నారు.
DK Aruna: లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలింది..
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!