Telangana: రేపటి నుంచి స్కూళ్లు యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మళ్లీ తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ ఏడాది కూడా తమ పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతాయా.? అనే భయాందోళల్లో తల్లిదండ్రులు ఉన్నారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయా.? లేదా.? అనే సందేహాలు తలెత్తాయి. అయితే జూన్ 13 నుంచి యాథాతథంగా స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెలవులను పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి విద్యాలయాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.
దేశంలో మొదటిసారిగా ఆన్ లైన్ క్లాసులు సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతో ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. పాఠశాలలకు వచ్చే పిల్లలకు స్వాగతం చెప్పారు సబితా ఇంద్రారెడ్డి. ప్రత్యక్ష బోధనకు, ఆన్ లైన్ బోధనకు చాలా తేడా ఉంటుందని ఆమె అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, కస్తూర్భా పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కలుపుకుని మొత్తం 60-65 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు రాబోతున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
మన ఊరు మనబడి కింద 9 వేల స్కూళ్లను మంజూరు చేసుకున్నామని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం మొదలు పెడుతున్నామని అన్నారు. ఒకటో తరగతి నుంచి 8 వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని.. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని జాయిన్ చేయాలని కోరారు. ఇప్పటికే అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.ఇంగ్లీష్, తెలుగు భాషల్లో పుస్తకాలను ముద్రించామని ఆమె వెల్లడించారు. తాగునీరు, సానిటేషన్ మొదలైన సదుపాయాలను కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఓ పండగ వాతావరణంలాగా పాఠశాలను ప్రారంభించాలని సూచించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!