Amit Shah: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా వద్దా.. 2024లో మోదీని మరోసారి ప్రధాని కావాలా వద్దా అని అన్నారు. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుందని ఆరోపించారు. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2021లో విగ్రహ ప్రతిష్టపన చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని అమిత్ షా అన్నారు. 370 ఆర్టికల్ ని కాంగ్రెస్ అడ్డుకుంది.. అయినా మోడీ సర్కారు ఆర్టికల్ ని రద్దు చేసిందని తెలిపారు. పాకిస్తాన్ గడ్డపై సర్జికల్ స్ట్రైక్ చేసి వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు.
karisma Kapoor : లైవ్ షోలో ఏడ్చేసిన కరిష్మా కపూర్..కంటతడి పెట్టిస్తున్న వీడియో..
Also Read
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని అమిత్ షా ఆరోపించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే 2000 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ నట్టేట ముంచారు.. నిరుద్యోగులకు భృతి ఏమైందని ప్రశ్నించారు. 2.50 కోట్ల మందికి కేంద్రం ఉద్యోగాలు ఇచ్చినా, ఎక్కడ పేపర్ లీక్ కాలేదు.. తెలంగాణలో మాత్రం ప్రతి పేపర్ లీకులు అవుతున్నాయని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి వేసినట్టేనని అమిత్ షా తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారన్నారు.
Mrunal Thakur: ఈ ఒక్కటి దాటేస్తే మృణాల్ ఠాకూర్ నిలబడ్డట్టే!
మరోవైపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు పెంచారని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి ఓట్లు అడిగే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా.. ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఉన్నామన్నారు. తొలి క్యాబినెట్ లోనే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గిస్తామని చెప్పారు. రైతులకు ఎకరాకు 25 శాతం ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తాం.. ప్రజారోగ్యం కోసం 10 లక్షల భీమా కల్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా.. ఒక్క ఓటు పటాన్ చెరు బీజేపీ అభ్యర్థికి.. మరో ఓటు మోడీకి వేయండని అమిత్ షా తెలిపారు.
- Tags
- Amit Shah
- bjp
- BRS
- Election Campaign
- kcr
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!