Jagga reddy: మళ్లీ హ్యాక్ చేశారు.. మరోసారి సైబర్ టీంకు జగ్గారెడ్డి కంప్లైంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga reddy: నిత్యం ఆసక్తికర కామెంట్లతో వార్తల్లో నిలిచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని జగ్గారెడ్డి వెల్లడించారు. తన ఫేస్ బుక్ పేజీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి రకరకాల పోస్టులు పెడుతున్నారని జగ్గారెడ్డి వివరించారు. అయితే గతంలో కూడా హ్యాకింగ్కు గురైనట్లు తెలిపిన జగ్గారెడ్డి.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫేస్ బుక్ పేజీ హ్యాక్ కావడంతో మరోసారి సైబర్ టీమ్ కు ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇలా హ్యాక్ అవ్వడం మన దురదృష్టకరం అన్నారు. హ్యాక్ చేసిన తర్వాత పోస్ట్ చేయడం దరిద్రం.. ఆ పోస్ట్పై దరిద్రంగా కామెంట్లు పెట్టే వాళ్లు ఉంటారు కదా అది ఇంకా దరిద్రం అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి పోస్టులకు ఎవరూ అయోమయానికి గురికావద్దని.. ఫేస్ బుక్ ఫాలోవర్స్ అందరూ గమనించాలని జగ్గారెడ్డి కోరారు.
Read also: Auto workers: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా.. మద్దతుగా భట్టివిక్రమార్క
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
ఇదిలా ఉంటే.. తాను కూడా పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి తాజాగా కొత్త ప్రస్తావన తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీపీసీసీ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర చేయగా.. తాము కూడా పాదయాత్ర చేయాలని నాయకత్వానికి విన్నవించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్కు లేఖ కూడా రాశారు. రేవంత్, భట్టి పోటీ చేయని 47 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే అధికార యంత్రాంగం నుంచి కూడా అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ పాదయాత్ర ఎవరికీ వ్యతిరేకంగా చేయలేదని కూడా స్పష్టం చేశారు. పాదయాత్ర ఎవరు చేసినా పార్టీకి మేలు జరుగుతుందన్నారు. అయితే ఈ విషయంపై అధికార యంత్రాంగం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.
Tamilnadu : తమిళనాడులో దారుణం.. ఐదుగురు చిన్నారులపై గ్యాంగ్ రేప్
తాజావార్తలు
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!