Auto workers: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా.. మద్దతుగా భట్టివిక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto workers strike in Yadagirigutta: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. యాదాద్రి జిల్లా ఆలయ పునర్నిర్మాణం తర్వాత స్థానిక ఆటోలను కొండపైకి అధికారులు అనుమతించలేదని మండిపడ్డారు. దీంతో కొండపైకి స్థానిక ఆటోలను అనుమతించాలని స్థానిక ఆటో డ్రైవర్లు చాలాకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆటో కార్మికులను కొండపైకి అనుమతించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. అయితే ఈ ధర్నాకు మద్దతుగా ధర్నా స్థలం వద్దకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క కూర్చున్నారు. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు జరిగేది అభివృద్ధి… కానీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పుణ్య నిర్మాణం తర్వాత స్థానిక ఆటో కార్మికులు ఉపాధి కోల్పోవడం బాధాకరమన్నారు భట్టి విక్రమార్క. కొండపైకి ఆటోలను అనుమతి ఇవ్వద్దని ప్రభుత్వం, స్థానిక అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మండిపడ్డారు. కొండపైకి ఆటోలను అనుమతి ఇచ్చెలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
Read also: Indrakaran reddy: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో కార్మికుల సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వేడుకుంటున్నామన్నారు భట్టి విక్రమార్క. కారు ఉంటే తప్ప యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహా స్వామిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట అత్యంత పవిత్రమైన ప్రదేశమన్నారు. సీఎం యాదగిరిగుట్ట దేవుడిని యాదాద్రీ శ్రీ లక్ష్మీనారసింహాస్వామిగా ఖరీదైన దేవుడిగా మార్చినారని తెలిపారు. అహాంకారంతో విర్రవీగేవారినీ ఎలా దండించాలో శ్రీ లక్ష్మీనారసింహాస్వామికి తెలుసని తెలిపారు. స్దానిక యువత జీవనోపాది కోసం నడుపుకునే ఆటోలను కొండపైకి అనుమతి ఇవ్వకపోవడం భాదాకరమని తెలిపారు. ఆనిర్ణయం యువకుల ఉపాధి అవకాశాలను కొల్పోయేలా చేయడమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పద్దతిలో కొండపైనే భక్తులు రాత్రి సమయంలో నిద్రించే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పునుద్దరిస్తామని తెలిపారు.
Telangana Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్
తాజావార్తలు
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!