Munugodu By Poll: రేవంత్ సంచలన ప్రకటన.. వెనక్కి వస్తే రాజగోపాల్ రెడ్డికే బీ ఫామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి మళ్ళీ వెనక్కి వస్తే బీ ఫామ్ ఇస్తామని, అందరం రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటామని, పార్టీ సీనియర్ నేతలందరం ఆయన కోసం పని చేస్తామని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లాలో పాదయాత్ర సంర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెనర్.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు. బీజేపీలో కండువా కప్పుకున్నప్పుడే పండగ అని విమర్శించారు. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలకు బీజేపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని గుర్తుచేశారు. అద్వానీ, వెంకయ్య నాయుడు పరిస్థితి మీరందరూ చూస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. వెనక్కి వస్తే రాజగోపాల్ రెడ్డికి బీ ఫామ్ ఇస్తామని ప్రకటించారు. అందరం రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటామని రేవంత్ తెలిపారు. పార్టీ సీనియర్ నేతలందరం రాజగోపాల్ రెడ్డి కోసం పని చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరీంచని, తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చామని విమర్శించే మోడీ తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
అయితే.. రేపు అమిత్ షా భారీ బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువాకప్పుకోనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లోకి మళ్ళీ వెనక్కి వస్తే బీ ఫామ్ ఇస్తామని టీపీసీసీ రేవంత్ రెడ్డి మీడిమాద్వారా ప్రకటించడం సంచళనంగా మారింది. మరి దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందించనున్నారు. పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read
అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్టంలో ప్రజలు మునుగోడు వైపు చూస్తున్నారని తెలిపారు. సాయుద పోరాటానికి మునుగోడు చిరునామా అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాత్ర కీలకంమని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ వివక్షకు గురవుతుందని అన్నారు. కేసిఆర్ మునుగోడు సమస్యలకు పరిష్కారం చూపలేదని గుర్తుచేశారు. పోడుభూముల సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా, సాగు, తాగు నీటి సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కేసీఆర్ అవలంభించిన పద్ధతులనే అమలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు.
Revanth Reddy: అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారింది
తాజావార్తలు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!