Revanth Reddy: అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ తీవ్రంగా విమర్శించారు. యాదాద్రి జిల్లాలో పాదయాత్ర సంర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో ప్రజలు మునుగోడు వైపు చూస్తున్నారని తెలిపారు. సాయుద పోరాటానికి మునుగోడు చిరునామా అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాత్ర కీలకంమని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ వివక్షకు గురవుతుందని అన్నారు. కేసిఆర్ మునుగోడు సమస్యలకు పరిష్కారం చూపలేదని గుర్తుచేశారు. పోడుభూముల సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా, సాగు, తాగు నీటి సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కేసీఆర్ అవలంభించిన పద్ధతులనే అమలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు.
బీజేపీ పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మునుగోడులో కేసీఆర్ కు భిన్నంగా బీజేపీ చేస్తున్నది ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజాపతినిధులను బీజేపీ బహిరంగంగా కొనుగోలు చేస్తుంటే ఈటెల ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అంటే మొదట బీజేపీ 4 ఎంపీలు రాజీనామాలు చేయాలని అన్నారు. బీజేపీ పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేయించాలని, పార్టీలు మారిన వారిని రాజీనామా చేసిలా ప్రజలు ఒత్తిడి తీసుకురండని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అమ్ముడుపోయిన ప్రతి వాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే మునుగోడులో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. డిండి ఎత్తిపోతల పథకానికి వెంటనే కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. SLBC ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్వీర్యం చేసాడని పేర్కొన్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఎన్నికలు జరగడానికి 100రోజుల సమయం ఉందని, వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి బీజేపీ జాతీయ నేత అమిత్ షా జాతీయ హోదా కల్పించి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాలని తెలిపారు. ఒక్క ఓటుతో ఇద్దరు తోడు దొంగలకు టీఆర్ఎస్, బీజేపీ బుద్దిచెప్పాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అరాచకం సృష్టించదానికి టీఆర్ఎస్, బీజేపీ లు తీరాలేపాయన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణి చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని, టీఆర్ఎస్, బీజేపీ లు ఉప ఎన్నికల కోసం వేయి కోట్లు ఖర్చు పెడతారని తెలిపారు. కాంగ్రెస్ గెలవకపోతే పేదల గొంతు చచ్చిపోతుందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఈసందర్భంగా తెలిపారు.
TRS Mega Rally Live : హైదరాబాద్ నుండి మునుగోడుకు కేసీఆర్ భారీ ర్యాలీ.!
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!