Revanth Reddy: అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ తీవ్రంగా విమర్శించారు. యాదాద్రి జిల్లాలో పాదయాత్ర సంర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో ప్రజలు మునుగోడు వైపు చూస్తున్నారని తెలిపారు. సాయుద పోరాటానికి మునుగోడు చిరునామా అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాత్ర కీలకంమని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ వివక్షకు గురవుతుందని అన్నారు. కేసిఆర్ మునుగోడు సమస్యలకు పరిష్కారం చూపలేదని గుర్తుచేశారు. పోడుభూముల సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా, సాగు, తాగు నీటి సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కేసీఆర్ అవలంభించిన పద్ధతులనే అమలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు.
బీజేపీ పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మునుగోడులో కేసీఆర్ కు భిన్నంగా బీజేపీ చేస్తున్నది ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజాపతినిధులను బీజేపీ బహిరంగంగా కొనుగోలు చేస్తుంటే ఈటెల ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అంటే మొదట బీజేపీ 4 ఎంపీలు రాజీనామాలు చేయాలని అన్నారు. బీజేపీ పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేయించాలని, పార్టీలు మారిన వారిని రాజీనామా చేసిలా ప్రజలు ఒత్తిడి తీసుకురండని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. అమ్ముడుపోయిన ప్రతి వాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే మునుగోడులో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. డిండి ఎత్తిపోతల పథకానికి వెంటనే కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. SLBC ప్రాజెక్ట్ ను కేసీఆర్ నిర్వీర్యం చేసాడని పేర్కొన్నారు.
Also Read
- Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
- Telugu Film Industry : తెలుగు సినిమాకు తెలంగాణ సర్కార్ బిగ్ బూస్ట్.. కొత్త జీవోతో గేమ్చేంజ్.!
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
ఎన్నికలు జరగడానికి 100రోజుల సమయం ఉందని, వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి బీజేపీ జాతీయ నేత అమిత్ షా జాతీయ హోదా కల్పించి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళాలని తెలిపారు. ఒక్క ఓటుతో ఇద్దరు తోడు దొంగలకు టీఆర్ఎస్, బీజేపీ బుద్దిచెప్పాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అరాచకం సృష్టించదానికి టీఆర్ఎస్, బీజేపీ లు తీరాలేపాయన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంపిణి చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని, టీఆర్ఎస్, బీజేపీ లు ఉప ఎన్నికల కోసం వేయి కోట్లు ఖర్చు పెడతారని తెలిపారు. కాంగ్రెస్ గెలవకపోతే పేదల గొంతు చచ్చిపోతుందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఈసందర్భంగా తెలిపారు.
TRS Mega Rally Live : హైదరాబాద్ నుండి మునుగోడుకు కేసీఆర్ భారీ ర్యాలీ.!
తాజావార్తలు
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!