Revanth Reddy: విచారణ చేయకముందే ఇద్దరు మాత్రమే బాద్యులని కేటీఆర్ ఎలా చెపుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కస్టడీ లోకి తీసుకోక ముందు , విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి పేపర్ల లీకులపై ధ్వజమెత్తారు. సర్వీస్ కమిషన్ పేపర్లు అన్ని ముందే వాళ్లకు చేరాయని తెలిపారు. 2015 నుండి ప్రశ్న పత్రాల లీక్ కొనసాగుతుందని అన్నారు. కేటీఆర్ ఇద్దరు వ్యక్తులను మాత్రమే సంబంధం అంటున్నారని, ఇది వ్యవస్థకు సంబంధం లేదు అంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ చేయడమే కాదు జైలులో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళను ఎక్కడెక్కడ పెట్టారో చెప్పాలన్నారు. కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. నిందితుల దగ్గరికి ప్రభుత్వం తరుపున వెళ్లిన మధ్య వర్తులు ఎవరు? ఇది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జైలును సందర్శించిన విజిటర్ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సిసి ఫుటేజీ స్పష్టంగా కావాలని తెలిపారు.
Read also: Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. తనతో ఉన్నవాళ్లు కూడా దొంగలు
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
కస్టడీ లోకి తీసుకోక ముందు, విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ మండిపడ్డారు. సంస్ధలో పనిచేసే వాళ్లు ఎగ్జామ్ రాయడానికి వీలు లేదని, కానీ ప్రవీణ్ తో పాటు 20 మంది కి ఎలా ఎన్ ఓసి ఇస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర శాఖలకు వెళ్లాలి అక్కడే ఉద్యోగం చేయరాదన్నారు. మాధురి స్టేట్ ఫస్ట్, రజిని కాంత్ 4 ర్యాంక్, TSPSC లో పని చేస్తున్నారు. ఒకే సెంటర్ లో 25 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చాయన్నారు. కేటీఆర్ పీఏ తిరుపతి.. కేటీఆర్ షాడో మంత్రి అన్నారు. వీళ్లిద్దరి ఓకే మండలమని, రాజశేఖర్ రెడ్డి కి తిరుపతి ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి TSPSC కి పంపారని అన్నారు. ఈ కథ నడిపించింది తిరుపతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల మండలంలో 100 మందికి క్వాలిఫై అయ్యారని రేవంత్ తెలిపారు.
Naveen father: పేపర్ లీకేజ్ తో నవీన్ కి సంబంధం లేదు.. దయచేసి శవరాజకీయాలు చేయకండి
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!