Revanth Reddy: తల్లి లాంటి సోనియా గాంధీని మోదీ అవమానించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Comments On PM Narendra Modi Over Sonia Gandhi ED Interrogation: తల్లి లాంటి సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిచి ఘోరంగా అవమానించారంటూ ప్రధాని నరేంద్రమోదీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈడీ, సీబీఐలు తమ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు. మోదీకి రాక్షస ఆనందం ఉండొచ్చని, కానీ అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని విమర్శించారు.
ఏ దేశంలో అయితే మహిళలు అవమానానికి గురవుతారో, ఆ దేశానికి మంచిది కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మోదీని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీతో పాటు ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తెచ్చారన్నారు. దోచుకున్న దొంగల ఆట కట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆమె తీసుకొచ్చారన్నారు. మన తల్లిని ఎవరైనా అవమానించే పని చేస్తే.. తలనరికే వరకూ ఊరికే ఉంటామా? అంటూ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీకి అవమానం అంటే.. భారతమాతకు, తెలంగాణ తల్లికి అవమానం జరిగినట్టేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ఇదిలావుండగా.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీని గురువారం ఎన్స్పోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడు గంటలపాటు ప్రశ్నించింది. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహిళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారులు ఆమెకు 50 ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. పలు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాల్ని చేపట్టారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. రేవంత్ రెడ్డి కూడా మండిపడుతూ.. బీజేపీ బెదిరింపులకు తాము భయపడేదే లేదని తేల్చి చెప్తూ, పై విధంగా స్పందించారు.
తాజావార్తలు
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?