CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
- బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై సంచలన ఆరోపణలు
- కాంగ్రెస్ ఎంపీలపై కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
- జమిలి ఎన్నికలు, కాళేశ్వరం అంశాలపై స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తాజాగా మీడియా చిట్చాట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి లోపాయికారీ ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు దమ్ముంటే, తాను నమ్మే దేవుడి మీద ఒట్టేసి వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించాలని సవాల్ విసిరారు. భవిష్యత్తులో ఒకవైపు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, కోదండరాం ఒక కూటమిగా ఉంటాయని, మరోవైపు బీఆర్ఎస్ , బిజెపి ఒకే జట్టుగా మారి ఎన్నికల బరిలోకి దిగుతాయని ఆయన జోస్యం చెప్పారు.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి కేసీఆర్ చేసిన పరుష పదజాలాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటులో బిజెపి ఎంపీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య వెంటనే స్పందించి తిప్పికొట్టారని, ఆ విషయం బీఆర్ఎస్ నేతలకు వినిపించలేదా అని ప్రశ్నించారు. “వెదవలకు అందరూ వెదవల్లాగే కనిపిస్తారు” అంటూ కేసీఆర్ వ్యాఖ్యలకు అంతే దీటుగా సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందని, ఇప్పుడు ఆ పార్టీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రయోజనం తీరిపోయిన తర్వాత ఏ పార్టీకైనా భవిష్యత్తు ఉండదని చెబుతూ, బీఆర్ఎస్ను ఒక “చనిపోయిన శవంతో” పోల్చారు. కాలం చెల్లిన పార్టీని పట్టుకుని కేసీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న జమిలి ఎన్నికల అంశంపై కూడా రేవంత్ స్పందించారు. జమిలి అనేది ఎవరికీ అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థమని, బిజెపి నేతలు తమలో తామే మాట్లాడుకుంటున్నారు తప్ప దానిపై ఎవరికీ స్పష్టత లేదని కొట్టిపారేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Tags
- bjp
- BRS
- congress
- kcr
- revanth reddy
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!