CM Revanth Reddy : ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తున్నాం
- కేరళలో వేణుగోపాల్ సేవలకు రేవంత్ రెడ్డి ఘన సత్కారం
- ‘‘విద్యే సమాజానికి శక్తివంతమైన ఆయుధం’’ – రేవంత్ రెడ్డి
- 3,500 మందికి పైగా విద్యార్థులకు మెరిట్ అవార్డులు ప్రదానం
- కేరళ డ్రాప్ అవుట్ రేటు సున్నా.. తెలంగాణకు ఆదర్శమని సీఎం వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కేరళలోని అలెప్పీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఒక విశేషమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఘనంగా సత్కరించారు. ఆయన మాటల్లో, వేణుగోపాల్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, పేదల కోసం, అణగారిన వర్గాల కోసం ఎప్పటికప్పుడు పోరాడుతూ ప్రజలకు నిజమైన గొంతుకగా నిలుస్తున్న అసామాన్య వ్యక్తి. 2006లో ఆయన ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులు సమాజంలో విద్యా ప్రోత్సాహానికి మార్గదర్శకంగా నిలిచాయని గుర్తు చేశారు.
Also Read
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డుల ప్రాముఖ్యతను వివరించారు. “ఈ రోజు 150 పాఠశాలల నుండి 3,500 మందికి పైగా విద్యార్థులు ఈ అవార్డులు అందుకుంటున్నారు. విద్యార్థులను ప్రోత్సహించే ఈ కార్యక్రమం కేవలం కేరళలోనే కాకుండా దేశమంతటా ఆదర్శంగా నిలవాలి,” అని ఆయన అన్నారు. విద్య ప్రాధాన్యతపై మాట్లాడిన రేవంత్ రెడ్డి, “విద్య అనేది మనిషికి లభించే అత్యంత గొప్ప బహుమతి మాత్రమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తివంతమైన ఆయుధం కూడా. సమాజంలో సమానత్వం తీసుకురావడానికి, పేదరికాన్ని దూరం చేయడానికి విద్యే ప్రధాన మార్గం,” అని పేర్కొన్నారు. కేరళలో పదో, పన్నెండో తరగతుల తర్వాత విద్యార్థుల డ్రాప్ అవుట్స్ శాతం సున్నాగా ఉండటం దేశమంతటికి ఆదర్శమని ఆయన అభినందించారు.
అలాగే, తెలంగాణలో కూడా విద్యా రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. పాఠశాలల మౌలిక సదుపాయాల నుండి ఉన్నత విద్యా అవకాశాల వరకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని, భవిష్యత్తు భారత్కు బలం కావాల్సిన యువతను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. “యువతే రేపటి దేశ భవిష్యత్తు. వారికి సమాన అవకాశాలు కల్పించడంలో విద్యే ప్రధాన ఆధారం. ఈ దిశగా తెలంగాణలో ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నాం,” అని రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రారంభించిన విద్యా అవార్డులను ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో విద్యపై ఉన్న కట్టుబాటు, కేరళ మోడల్ పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగం అక్కడి విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!