Ramchander Rao : 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదు
- మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నాం
- తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారు
- లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చారు
- తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ముఖ్యమంత్రి కి తెలుసా :బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao : పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదన్నారు. కానీ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు రేవంత్ రెడ్డికి సమయం ఇచ్చారని, మీ పార్టీ ముఖ్యమంత్రి కి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు చెప్పాలన్నారు రామచందర్ రావు. మతపరమైన రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం కేంద్రం బాధ్యత అని అని అంటున్నారని, లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే ప్రక్రియ ముఖ్యమంత్రి కి తెలుసా ? అని ఆయన ప్రశ్నించారు.
తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే అంశాలు కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, 2006లో అయ్యర్ కోహ్లీ కేసులో .. సుప్రీంకోర్టు మరోసారి కేశవనంద భారతి కేసు తీర్పు ను దగ్గర మరోసారి పునరుద్ఘాటించిందన్నారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని, న్యాయపరమైన చిక్కులు తెలిసి …బీసీలను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. బీసీ బిల్లుకు, ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చాం.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ దే అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఎన్నికలు జరగకుండా ఉండేందుకు జరిగే ఎత్తుగడే ఈ మోసమని ఆయన ఆరోపించారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
తమిళనాడు తీర్పు నేపథ్యంలో …తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టే పరిస్థితి లేదని, పార్టీ క్రమశిక్షణ దాటితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు రామచందర్రావు. నాయకులందరూ పార్టీ విధానాలకు లోబడే పని చేయాలని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్లో రేవంత్ రాజగోపాల్ రెడ్డి మధ్య సమస్యలు.. బీఆర్ఎస్ లో కవితకు పార్టీకి మధ్య గొడవలు ఉన్నాయన్నారు. ప్రతి పార్టీలోనూ గొడవలు ఉన్నాయి వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుంటామన్నారు.
Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!