Rahul Gandhi: దూకుడు పెంచింది కాంగ్రెస్.. మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. తెలంగాణ కోసం ఒకరి తర్వాత ఒకరు జాతీయ నాయకుల క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు అందోల్ సభ, 2.30 గంటలకు సంగారెడ్డిలో నూక్కడ్, సాయంత్రం 4.15 గంటలకు కామారెడ్డి సమావేశంలో రాహుల్ పాల్గొంటారు. అనంతరం రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి ఎన్నికల పరిస్థితులపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.
Read also: Barrelakka: బర్రెలక్కకు ‘మా’ మద్దతు.. బేషరతుగా శిరీషకి సపోర్ట్
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
- Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
కాగా, రాహుల్ పర్యటన దృష్ట్యా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగెల్ కూడా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వరంగల్ పశ్చిమలోని కాజీపేట కూడలిలో వీధి సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో ప్రచార సభలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ముషీరాబాద్లో జరిగే ప్రచార సభలో ఆయన మాట్లాడనున్నారు.
Read also: Rythu Bandhu Funds: రైతుబంధు కోసం ఎదురుచూపులు.. బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఆలస్యం
రాహుల్ గాంధీ శనివారం రాత్రి ఆకస్మికంగా హైదరాబాద్ పర్యటించారు. నగరంలోని ముషీరాబాద్, అశోక్నగర్లో పర్యటించిన రాహుల్ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. నిరుద్యోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, నోటిఫికేషన్లు నిలిచిపోయిన ఘటనలపై నిరుద్యోగులు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అనంతరం చిక్కడపల్లిలోని బావర్చి హోటల్లో రాహుల్ నిరుద్యోగులతో కలిసి బిర్యానీ తిన్నారు. అక్కడ కస్టమర్లను కలిశారు. ఈ క్రమంలో పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగారు.
Srisailam: శ్రీశైలంకు పోటెత్తిన భక్తులు.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు!
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!