Rythu Bandhu Funds: రైతుబంధు కోసం ఎదురుచూపులు.. బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bandhu Funds: రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ, యాసంగి సీజన్కు సంబంధించి రెండో విడత నిధులు నవంబర్లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున డిపాజిట్లపై నిషేధం విధించాలని సూచించింది. కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం నవంబర్ 24న యాసంగి సీజన్లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినా ఇంకా డబ్బులు జమ కాలేదు. శని, ఆది, సోమవారాల్లో వరుసగా సెలవులు రావడంతో మంగళవారం 28న జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్లో రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ చేసేందుకు అనుమతించారు.
Read also: CM KCR: నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న కేసీఆర్
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
ఈ నెల 28లోగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. దీని ప్రకారం శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశాయి. అనంతరం ఫైలును ఆర్థిక శాఖకు పంపించారు. దీని ప్రకారం ఆర్థిక శాఖ రూ.7700 కోట్ల మొత్తాన్ని ట్రెజరీల నుంచి బ్యాంకులకు బదిలీ చేయాలి. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. శని, ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు కూడా పని చేయడం లేదు. మంగళవారం మళ్లీ పని దినం కావడంతో… ఆ రోజు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రైతుబంధు సాయం పంపిణీకి సంబంధించి రాష్ట్ర ఖజానా, వ్యవసాయ అధికారులకు శనివారం నాడు సమాచారం అందినట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న ఓటింగ్ జరగనుందని, ఈ నెల 28న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బూస్ట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
RBI: వ్యక్తిగత రుణాలపై ఆర్ బిఐ కొత్త రూల్స్.. ఇక అప్పు పుట్టుడు కష్టమే..
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?