Rythu Bandhu Funds: రైతుబంధు కోసం ఎదురుచూపులు.. బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bandhu Funds: రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ, యాసంగి సీజన్కు సంబంధించి రెండో విడత నిధులు నవంబర్లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున డిపాజిట్లపై నిషేధం విధించాలని సూచించింది. కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం నవంబర్ 24న యాసంగి సీజన్లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినా ఇంకా డబ్బులు జమ కాలేదు. శని, ఆది, సోమవారాల్లో వరుసగా సెలవులు రావడంతో మంగళవారం 28న జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్లో రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ చేసేందుకు అనుమతించారు.
Read also: CM KCR: నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న కేసీఆర్
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఈ నెల 28లోగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. దీని ప్రకారం శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశాయి. అనంతరం ఫైలును ఆర్థిక శాఖకు పంపించారు. దీని ప్రకారం ఆర్థిక శాఖ రూ.7700 కోట్ల మొత్తాన్ని ట్రెజరీల నుంచి బ్యాంకులకు బదిలీ చేయాలి. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. శని, ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు కూడా పని చేయడం లేదు. మంగళవారం మళ్లీ పని దినం కావడంతో… ఆ రోజు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రైతుబంధు సాయం పంపిణీకి సంబంధించి రాష్ట్ర ఖజానా, వ్యవసాయ అధికారులకు శనివారం నాడు సమాచారం అందినట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న ఓటింగ్ జరగనుందని, ఈ నెల 28న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బూస్ట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
RBI: వ్యక్తిగత రుణాలపై ఆర్ బిఐ కొత్త రూల్స్.. ఇక అప్పు పుట్టుడు కష్టమే..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!