Raghunandan Rao: ఆమ్నేషియా పబ్ కేసులో హోంమంత్రి మనవడే ప్రధాన సూత్రధారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగికదాడిలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. హోంమంత్రి మహమూద్ అలీ మనవడే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు చేశారు. పబ్ లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి, వక్ఫ్ బోర్డు పెద్దమనిషి కొడుకు, ఓల్డ్ సిటీ ప్రముఖ పత్రికా డైరెక్టర్ కొడుకుతో పాటు హోం మంత్రి పీఏగా చెప్పుకుంటున్న హరి సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తున్నారని.. కారు ఎవరిది, ఇన్నోవా ఎవరిదని ప్రశ్నించారు. ఈ కార్లను ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. సీసీ కెమెరా పుటేజీ మీ దగ్గర ఉందా.. డీజీపీ మహేందర్ రెడ్డి చెబితే బాగుంటుందని అన్నారు.
పథకం ప్రకారం హిందు అమ్మాయిలపై రజాకార్ల మనస్తత్వం కలిగిన ఎంఐఎం పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హోంమంత్రిని తొలగించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరికైతే ఈ కేసుతో సంబంధం ఉందో వారందరిని శిక్షించాలని డిమాండ్ చేశారు. హోమంత్రిని ఉంటే పారదర్శకతంగా విచారణ జరగదని బీజేపీ తరుపున మేం భావిస్తున్నాం అని అన్నారు. మైనర్ అమ్మాయిలకు సంబంధించిన కేసులో విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా విచారణ జరగాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Also Read
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
అయితే ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అత్యాచార వ్యవహారంలో నలుగురు నిందితులపై పోక్సో కేసును పెట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని వైద్య పరీక్షలు పంపించారు. ఈ ఘటనలో బాలికను పబ్ కు తీసుకెళ్లిన హాడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హాడీని బురిడి కొట్టించి అమ్మాయిని కార్లో తీసుకెళ్లారని.. రెండు గంటల పాటు నలుగురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత బాలికను పబ్ దగ్గర కార్లో దించారు. ఈ ఘటనకు సంబంధించి పబ్, బేకరీ సీసీ కెమెరా ఫులేజ్ ను పోలీసులు కలెక్ట్ చేశారు.
తాజావార్తలు
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!