TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
- రాహుల్ అరెస్ట్ను ఖండించిన టీపీసీసీ
- రేపు భారీ నిరసన ర్యాలీ
- నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు మార్చ్
- కాంగ్రెస్ శ్రేణులకు మహేష్ గౌడ్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ చర్యలు నిరంకుశత్వానికి, నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఈ అక్రమ అరెస్ట్లను నిరసిస్తూ రేపు ఉదయం ‘ఛలో రాజ్ భవన్’ (లోక్ భవన్) కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
NEET పరీక్ష పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని, అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోడీ ఇంటి ముందు ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపట్టారని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, విచారణకు భయపడి భాజపా సర్కార్ తోక ముడిచి అరెస్టులకు పాల్పడిందని విమర్శించారు.
Also Read
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ఈ క్రమంలోనే భాజపా నిరంకుశ పాలనపై పెద్ద ఎత్తున సమరం చేయడానికి రేపు ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ (లోక్ భవన్) వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి భాజపా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!