Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
- కేటీఆర్పై మంత్రి లక్ష్మణ్ విమర్శలు
- కొండగట్టు ఘటనను గుర్తు చేసిన మంత్రి
- డబుల్ బెడ్రూమ్ హామీపై బీఆర్ఎస్కు చురకలు
- కాంగ్రెస్ హామీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం , రచ్చపల్లి గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్కు రైతుల కష్టాలు ఎన్నడూ కనిపించలేదని, ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరామర్శల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతే అప్పటి సీఎం కేసీఆర్ కనీసం బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రైతులకు నేరుగా అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి చిల్లర రాజకీయం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
నంది మేడారం, రచ్చపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను దారుణంగా మోసం చేసిందని, ఆ హామీని ఎన్నడూ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని నిలబెట్టుకుంటుందని, పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?